వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: బెంగాల్‌లో పిడుగుల వర్షం -23 మంది దుర్మరణం -ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

|
Google Oneindia TeluguNews

రుతుపవనాల రాక మొదలుకావడంతో వాతావరణం మారిపోయి, పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం రాష్ట్రాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. బెంగాల్ లోని పలు జిల్లాల్లో అసాధారణ స్థాయిలో వర్షాలు కురవడంతోపాటు కనీవినీ ఎరుగని రీతిలో పిడుగులు పడ్డాయి. కేవలం పిడుగుపాట్లకే పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు..

Recommended Video

Cyclone Yaas: Andhra Pradesh ముంచుకొస్తున్న తుపాను | Odisha, WB Alert || Oneindia Telugu

బెంగాల్ వ్యాప్తంగా సోమవారం సాయంత్ర కురిసిన భారీ వర్షాలకు ప్రాణనష్టం భారీగా ఉంది. పిడుగులు పడటంతో 23 మంది చనిపోగా, పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డారు. దక్షిణ బెంగాల్‌లోని కోల్‌కతాతో పాటు పలు జిల్లాల్లో కూడా భారీ ఉరుములు, పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. పిడుగుల కారణంగా ముర్షిదాబాద్‌లో 9 మంది, హుగ్లీలో 10, పశ్చిమ మిడ్నాపూర్, హౌరా జిల్లాల్లో ఇద్దరుచొప్పున మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోయారు.

జగన్‌కు ఎన్డీఏ షాక్?: రఘురామకు బిహార్ సీఎం మద్దతు! -ఫోన్ బెదిరింపులపై ఏపీ సీఐడీ కీలక వివరణజగన్‌కు ఎన్డీఏ షాక్?: రఘురామకు బిహార్ సీఎం మద్దతు! -ఫోన్ బెదిరింపులపై ఏపీ సీఐడీ కీలక వివరణ

lightning-claims-23-lives-in-west-bengal-heavy-rainfall-pm-modi-condolence

బెంగాల్ లో పిడుగుపాటు మరణాలు భారీగా ఉండటంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు సంతాపం తెలిపారు. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మోదీ ఆశాభావం వ్య‌క్తం చేశారు. బెంగాల్ లోని అలీపోర్ వాతావరణ కార్యాలయం వివరణ ప్రకారం.. జూన్ 11 న బంగాళాఖాతానికి ఉత్తరాన అల్పపీడనం త‌లెత్త‌నున్న‌ది. ఇదే అల్పపీడనంతో రుతుపవనాల వర్షాలు బెంగాల్‌పై కురుస్తాయి.

కోల్‌కతా నగరంలో సోమవారం మధ్యాహ్నం నుంచి మేఘాలు క‌మ్ముకోవ‌డంతో రాజ‌ధాని న‌గ‌రం చీకటిగా మారిపోయింది. బలమైన గాలులతో కూడిన వ‌ర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసి ప‌లు ప్రాంతాల్లో ఇళ్లకు నష్టం వాటిల్లింది. 'యాస్' తుఫాను తర్వాత‌ బెంగాల్‌లో సున్నిత‌మైన వేసవి కాలం ప్రారంభమై ప్రజలను చెమటతో తడిసిపోయేలా చేసింది. ఉష్ణోగ్రత కూడా రోజు రోజుకు పెరుగుతూ వ‌చ్చింది. రుతుపవనాలు రాకముందే వర్షం కురియ‌డంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించిన‌ట్ల‌యింది.

English summary
Atotal of 23 people have lost their lives in three districts due to lightning in South Bengal. Since afternoon, Kolkata, too, witnessed thunderstorm and heavy showers. Nine have lost their lives in Murshidabad, 10 in Hooghly, two in Howrah and two in West Midnapore district. Prime Minister in a tweet said: "My thoughts are with all those who lost their near and dear ones due to lightning in parts of West Bengal. May the injured recover at the earliest."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X