షాకింగ్: బెంగాల్లో పిడుగుల వర్షం -23 మంది దుర్మరణం -ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
రుతుపవనాల రాక మొదలుకావడంతో వాతావరణం మారిపోయి, పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం రాష్ట్రాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. బెంగాల్ లోని పలు జిల్లాల్లో అసాధారణ స్థాయిలో వర్షాలు కురవడంతోపాటు కనీవినీ ఎరుగని రీతిలో పిడుగులు పడ్డాయి. కేవలం పిడుగుపాట్లకే పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు..
Recommended Video
బెంగాల్ వ్యాప్తంగా సోమవారం సాయంత్ర కురిసిన భారీ వర్షాలకు ప్రాణనష్టం భారీగా ఉంది. పిడుగులు పడటంతో 23 మంది చనిపోగా, పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డారు. దక్షిణ బెంగాల్లోని కోల్కతాతో పాటు పలు జిల్లాల్లో కూడా భారీ ఉరుములు, పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. పిడుగుల కారణంగా ముర్షిదాబాద్లో 9 మంది, హుగ్లీలో 10, పశ్చిమ మిడ్నాపూర్, హౌరా జిల్లాల్లో ఇద్దరుచొప్పున మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోయారు.

బెంగాల్ లో పిడుగుపాటు మరణాలు భారీగా ఉండటంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగాల్ లోని అలీపోర్ వాతావరణ కార్యాలయం వివరణ ప్రకారం.. జూన్ 11 న బంగాళాఖాతానికి ఉత్తరాన అల్పపీడనం తలెత్తనున్నది. ఇదే అల్పపీడనంతో రుతుపవనాల వర్షాలు బెంగాల్పై కురుస్తాయి.
కోల్కతా నగరంలో సోమవారం మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకోవడంతో రాజధాని నగరం చీకటిగా మారిపోయింది. బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసి పలు ప్రాంతాల్లో ఇళ్లకు నష్టం వాటిల్లింది. 'యాస్' తుఫాను తర్వాత బెంగాల్లో సున్నితమైన వేసవి కాలం ప్రారంభమై ప్రజలను చెమటతో తడిసిపోయేలా చేసింది. ఉష్ణోగ్రత కూడా రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. రుతుపవనాలు రాకముందే వర్షం కురియడంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించినట్లయింది.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications