వర్ష బీభత్సం: ఉరుములు, మెరుపులకు 68 మంది మృత్యువాత..
దేశవ్యాప్తంగా చాలా చోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. నైరుతు రుతుపవనాల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో భారీ వర్షం పడుతోంది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంపాక్ట్ ఉందని వాతావారణ శాఖ తెలియజేసింది. రాజస్తాన్, హర్యానా, పంజాబ్లో కూడా వర్ష ప్రభావం ఉంది. ఉరుములతో ప్రాణ నష్టం కలిగింది.
రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఉరుములు మెరుపులు వచ్చాయి. దీంతో 68 మంది వరకు చనిపోయారు. హర్యానా, డిల్లీ.. రాజస్తాన్ జై సల్మేర్, గంగానగర్ జిల్లాల్లో రెయిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. గాలి దిశ మారిందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్రో తెలియజేశారు.
ఇడుక్కి, కన్నూర్, కసర్ గడ్ వద్ద ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీచేసింది. ఇడుక్కి, మలప్పురం, కొజికోడ్, కన్నూర్, కసర్ గడ్ వద్ద ఎల్లొ అలర్ట్ ఇచ్చింది. ఎర్నాకులం, త్రిసూర్, వయానాడ్ వద్ద భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. కేరళ, కర్ణాటక, లక్షదీవుల్లో మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని కోరింది. గాలులు 40 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో వస్తాయని చెప్పింది