క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
Lok Sabha election 2024: దేశంలో లోక్సభ ఎన్నికల ఘట్టానికి తెర లేచింది. మొత్తం ఏడు దశల్లో ముగిసే ఎన్నికలు ఇవి. తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలయింది. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
జూన్ 1వ తేదీ నాటితో ఏడు దశల పోలింగ్ ముగుస్తుంది. అదే నెల 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లల్లో అసెంబ్లీకీ ఎన్నికలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లోని ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకొంటారు. అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ఓటర్లు ఎవరికి పట్టాభిషిక్తులను చేస్తారనేది 4వ తేదీన తేలిపోతుంది.

లోక్సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నేడు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో 60, సిక్కింలో 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ షెడ్యూల్ అయింది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు.
తమిళనాడులో మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాలకూ నేడే పోలింగ్ జరుగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి నిల్చున్నారు. పలువురు ప్రముఖులు తొలి గంటలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కూడా.
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు శివగంగ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి పీ కార్తీ చిదంబరం ఓటు వేశారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. చెన్నై శాలిగ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. చెన్నై సౌత్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి.. సేలంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.సూపర్ స్టార్ అజిత్.. సైతం తొలి గంటలోనే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన చెన్నై తిరువాన్మియుర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటర్లతో పాటు క్యూలో నిల్చున్నారు. తన వంత వచ్చేంత వరకూ క్యూలోనే ఉన్నారాయన. అనంతరం ఓటు వేశారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications