లోకసభలో గందరగోళం: 50 మందిని ఎలా లెక్కించాలి.. టీడీపీ-వైసీపీలకు స్పీకర్
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు ఆరో రోజు కూడా వాయిదా పడ్డాయి. లోకసభ మంగళవారానికి వాయిదా పడింది. అవిశ్వాస తీర్మానంపై గత ఆరు రోజులుగా టీడీపీ, వైసీపీ సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నారు. సభ సజావుగా లేదంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చ చేపట్టడం లేదు.
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
శుక్రవారం కూడా టీడీపీ నుంచి తోట నర్సింహం, వైసీపీ నుంచి వైవీ సుబ్బారావులు అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. దీంతో సభ మొదటిసారి పన్నెండు గంటలకు వాయిదా పడింది.

ఆ తర్వాత సభ ప్రారంభమైనా అదే గందరగోళం. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ, వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఏపీకి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తు నినాదాలు చేశారు.
అవిశ్వాసంపై చర్చ చేపట్టాలంటే సభ ఆర్డర్లో ఉండాలని, సభ్యులను లెక్కించాలంటే సభ సజావుగా సాగాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. సభ సజావుగా ఉంటేనే అవిశ్వాసంపై చర్చ చేపట్టగలమని చెప్పారు. లేదంటే అవిశ్వాసానికి యాభై మంది మద్దతు ఉందని ఎలా లెక్కించగలమన్నారు. ఆ తర్వాత సభలో మరింత గందరగోళం చెలరేగడంతో మంగళవారానికి వాయిదా వేసారు.
ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి తెలుగుదేశం, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే కారణమని వైసీపీ ఎంపీ వరప్రసాద రావు శుక్రవారం మండిపడ్డారు. 2014లో వైసీపీ విషయంలో ప్రజలు ఎలా ఉన్నారో, ఇప్పుడు బీజేపీ పరిస్థితి అలాగే ఉండనుందన్నారు.
అవిశ్వాస తీర్మానం కోసం అన్ని పార్టీల మద్దతు కూడగట్టామని వరప్రసాద రావు అన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు అందరూ రాజీనామా చేస్తారని ఆయన చెప్పారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవడం బాధాకరమన్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications