Lok Sabha polls Phase 5: లోక్ సభ పోరు ఐదో దశలో చురుగ్గా పోలింగ్-11 గంటలకు 24 శాతం..!
దేశంలోని ఆరు రాష్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 49 లోక్ సభ సీట్లకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ చురుగ్గా కొనసాగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఇందులో యూపీలోని అమేథీ, రాయ్ బరేలీ సీట్లపై అందరి దృష్టీ నెలకొంది. పోలింగ్ కేంద్రాలకు భారీ ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం మరోసారి కోరింది.
రాహుల్ గాంధీ, రాజ్ నాథ్ సింగ్, స్మతీ ఇరానీ, ఒమర్ అబ్దుల్లా వంటి నేతల భవితవ్యం తేల్చబోతున్న ఈ ఐదో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో ఉదయం 11 గంటల వరకూ 20 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ముఖ్యంగా యూపీలోని అమేథీ, రాయ్ బరేలీ వంటి సీట్లలో ఈసారి ఎవరు గెలవబోతున్నారనే దానిపైనా ఉత్కంఠ నెలకొన్న వేళ పోలింగ్ శాతాలు కీలకంగా మారబోతున్నాయి.

ఉదయం 11 గంటల కల్లా 23.66 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. ఇందులో పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 32.7 శాతం పోలింగ్ నమోదైంది. లడఖ్ లో 27.87 శాతం, యూపీలో 27.76 శాతం పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో మాత్రం అత్యల్పంగా 15.93 శాతం పోలింగ్ జరిగింది. దీంతో ప్రధాని మోడీ సహా ప్రముఖులు భారీ ఎత్తున ఓట్లు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.
-
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!!












Click it and Unblock the Notifications