Lok Sabha polls Phase 5: లోక్ సభ పోరు ఐదో దశలో చురుగ్గా పోలింగ్-11 గంటలకు 24 శాతం..!
దేశంలోని ఆరు రాష్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 49 లోక్ సభ సీట్లకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ చురుగ్గా కొనసాగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఇందులో యూపీలోని అమేథీ, రాయ్ బరేలీ సీట్లపై అందరి దృష్టీ నెలకొంది. పోలింగ్ కేంద్రాలకు భారీ ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం మరోసారి కోరింది.
రాహుల్ గాంధీ, రాజ్ నాథ్ సింగ్, స్మతీ ఇరానీ, ఒమర్ అబ్దుల్లా వంటి నేతల భవితవ్యం తేల్చబోతున్న ఈ ఐదో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో ఉదయం 11 గంటల వరకూ 20 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ముఖ్యంగా యూపీలోని అమేథీ, రాయ్ బరేలీ వంటి సీట్లలో ఈసారి ఎవరు గెలవబోతున్నారనే దానిపైనా ఉత్కంఠ నెలకొన్న వేళ పోలింగ్ శాతాలు కీలకంగా మారబోతున్నాయి.

ఉదయం 11 గంటల కల్లా 23.66 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. ఇందులో పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 32.7 శాతం పోలింగ్ నమోదైంది. లడఖ్ లో 27.87 శాతం, యూపీలో 27.76 శాతం పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో మాత్రం అత్యల్పంగా 15.93 శాతం పోలింగ్ జరిగింది. దీంతో ప్రధాని మోడీ సహా ప్రముఖులు భారీ ఎత్తున ఓట్లు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.
-
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications