లోక్ సభ ఎంపీపై అనర్హత వేటు- సెక్రటేరియట్ సంచలన నిర్ణయం..!
కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ పై ఇవాళ లోక్ సభ సచివాలయం అనర్హత వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2009 నాటి హత్యాయత్నం కేసులో ఆయన్ను దోషిగా నిర్ధారిస్తూ తాజాగా కవరత్తిలోని స్ధానిక కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. క్రిమినల్ కేసుల్లో దోషిగా నిర్ధారణ అయితే అనర్హత వేటు వేయాలన్న ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధన ప్రకారం ఫైజల్ పై వేటు వేస్తూ సచివాలయం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది.
కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ విధించిన ఆంక్షలపై గట్టిగా పోరాడిన ఎంపీ ఫైజల్ పై కేంద్రం గుర్రుగా ఉంది. ఎన్సీపీకి చెందిన ఫైజల్ పై ఇప్పటికే అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలతో పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. స్ధానిక ప్రజల జీవనోపాధిని దెబ్బతీసే సదరు ఆంక్షల విషయంలో గవర్నర్ తో హోరాహోరీగా పోరాడారు. ఇదే క్రమంలో ఆయనపై కేంద్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ పలు ఫిర్యాదులు కూడా చేశారు. చివరికి 2009 నాటి ఓ కేసును తవ్వి ఫైజల్ పై అభియోగాలు నమోదు చేశారు. వీటిని స్ధానిక కోర్టు నిర్ధారించడంతో ఆయన జైలుకెళ్లారు.

ఈ నేపథ్యంలో లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్పై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 11 బుధవారం నుండి ఇది అమలులోకి వచ్చినట్లు సచివాలయం పేర్కొంది. 2009 నాటి హత్యాయత్నం కేసులో లక్షద్వీప్లోని కవరత్తికి చెందిన సెషన్స్ కోర్టు ఫైజల్ పై 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించిన తర్వాత ఫైజల్తో పాటు మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారించి కన్నూర్ సెంట్రల్ జైలుకు పంపారు. 2009 లోక్సభ ఎన్నికల సమయంలో రాజకీయ ప్రేరేపిత దాడిగా పేర్కొంటూ ఫైజల్ పై హత్యా నేరం మోపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు వేసే అవకాశముంది.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications