Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పూరీ జగన్నాథుడు ప్రధాని మోదీకి భక్తుడట..!!

Lok Sabha elections 2024 Phase 6: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీన ఆరో విడత పోలింగ్ జరుగనుంది. ఇప్పటివరకు అయిదు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ సహా మొత్తం 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 13వ తేదీన పూర్తయింది.

ఆరో విడత పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ దశలో ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 58 లోక్‌సభ స్థానాలకు 26వ తేదీన పోలింగ్ జరుగనుంది. బిహార్- 8, ఢిల్లీ- 6, హర్యానా-10, బిహార్- 5, జమ్మూ కాశ్మీర్- 1, ఒడిశా- 6, ఉత్తరప్రదేశ్- 14, పశ్చిమ బెంగాల్- 8, జార్ఖండ్-4 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ షెడ్యూల్ అయిందా రోజున.

Lord Jagannath devotee of PM Modi says Sambit Patra

ఆరో విడత ఎన్నికల్లో పైచేయి సాధించడానికి అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. ఎత్తులు పైఎత్తులు వేస్తోన్నాయి. ముమ్మరంగా ప్రచారాన్ని సాగిస్తోన్నాయి. ఇంకో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తెర పడనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే.. రోడ్ షోలతో హోరెత్తిస్తోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య భారతీయ జనతా పార్టీని తీవ్ర ఇక్కట్లలోకి నెట్టారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు సంబిత్ పాత్రా. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్నాయి. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తోన్నప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఒడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీలో వెలిసిన జగన్నాథుడు ప్రధాని మోదీ భక్తుడంటూ సంబిత్ పాత్రా చెప్పారు. పూరీలో మోదీ నిర్వహించిన రోడ్ షో గురించి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూరీ రోడ్ షో దిగ్విజయంగా ముగిసిందని, సాక్షాత్తూ జగన్నాథుడు.. మోదీకి భక్తుడిలా మారిపోయాడని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యల కలకలం రేపాయి. బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు. జగన్నాథుడు ఒక మానవ మాత్రుడికి భక్తుడిగా అభివర్ణించడం పట్ల మండిపడ్డారు. కోట్లాదిమంది హిందువులు, ప్రపంచవ్యాప్తంగా నివసిస్తోన్న ఒడిశా ప్రజల మనోభావాలను సంబిత్ పాత్రా అవమానించారంటూ విమర్శించారు.

పూరీ జగన్నాథుడు- హిందువులు, హైందవం, ఒడిశా అస్తిత్వానికి ప్రతీక అని గుర్తు చేశారు. తమ రాజకీయాల కోసం భగవంతుడిని సైతం వాడుకోవడం బీజేపీ నాయకులకు కొత్తేమీ కాదని నవీన్ పట్నాయక్ ధ్వజమెత్తారు. దేవుళ్లు, మతాలను అడ్డుగా పెట్టుకుని రాజకీయాలు చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు.

అటు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, కేరళ కాంగ్రెస్ నాయకులు కూడా సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. భగవంతుడిని సైతం మించిపోయేలా బీజేపీ నాయకులు వ్యవహరిస్తోన్నారని, దేవుళ్లను లెక్క చేయట్లేదని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+