Medical Student: పీవీ మానసను రివాల్వర్ తో కాల్చి చంపి ప్రియుడి ఆత్మహత్య, ఏం జరిగిందంటే ?
కొచ్చి/చెన్నై: సోషల్ మీడియాలో పరిచయం అయిన దంతవైద్య విద్యార్థినితో యువకుడు ప్రేమలో పడ్డాడు. ఇద్దరు ఇంతకాలం కలిసిమెలసి తిరిగి నిత్యం ఫోన్ లో టచ్ లో ఉన్నారు. ఇటీవల ప్రియుడికి వైద్య విద్యార్థిని బ్రేకప్ చెప్పిందని సమాచారం. ప్రేమించిన దంతవైద్య విద్యార్థిని దూరం అవుతోందని ఆమె మాజీ ప్రియుడు రగిలిపోయాడు. ఇటీవల పోలీస్ స్టేషన్ లో పంచాయితీ జరిగింది. విద్యార్థిని నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లిన మాజీ ప్రియుడు ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ప్రియురాలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలని చెప్పింది. అంత వరకు రాజీ చేసుకోవడానికి ప్రయత్నించిన మాజీ ప్రియుడు ఒక్కసారిగా రివాల్వర్ తీసుకుని దంతవైద్య విద్యార్థిని మీద కాల్పులు జరిపాడు. తరువాత అదే రివాల్వర్ తో అతను కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
Illegal affair: లడ్డూ లాంటి పెళ్లానికి రసగుల్లా లాంటి లవర్, బెడ్ రూమ్ లో కొడుకు ఏడ్చాడని !
దంతవైద్య విద్యార్థిని
కేరళలోని కన్నూర్ లోని నారత్ ప్రాంతంలో నివాసం ఉంటున్న పీవీ మానస (24) అనే యువతి కొత్తమంగళం సమీపంలోని నెల్లికుల్లి ప్రాంతంలోని ఇందిరాగాంధీ ఇన్సిట్యూట్ ఆఫ్ డెంటల్ కాలేజ్ లో నాలుగవ సంవత్సరం చదువుతోంది. మానస ఇందిరాగాంధీ కాలేజ్ లో చదువుతున్న సాటి అమ్మాయిలతో కలిసి కాలేజ్ కు సమీపంలోని ఓ వ్యక్తి ఇంటి మీద అద్దెకు ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నది.
ఇన్ స్టాగ్రామ్ ఫ్రెండ్
రెండు సంవత్సరాల క్రితం కన్నూర్ జిల్లాకు చెందిన రఖిల్ (32) అనే యువకుడు మానసకు పరిచయం అయ్యాడు. సోషల్ మీడియాలో పరిచయం అయిన మానస, రఖిల్ ఇద్దరు తరువాత ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు. కొంతకాలానికి నేరుగా కలుసుకున్న మానస, రఖిల్ స్నేహితులు అయ్యారు.
నెల ముందు బ్రేకప్
మానస, రఖిల్ ప్రేమలో పడ్డారని సమాచారం. స్నేహితులతో కలిసి రూమ్ లో ఉంటున్న మానస కాలేజ్ పూర్తి అయిపోయిన తరువాత ఆమె ప్రియుడు రఖిల్ తో ఎక్కువగా గడిపేదని సమాచారం. కొన్ని నెలల క్రితం మానస, రఖిల్ మద్య తేడాలు వచ్చాయి. కొంతకాలం బాయ్ ఫ్రెండ్ రఖిల్ తో గొడవపడిన మానస అతనికి గుడ్ బాయ్ చెప్పేసింది.
పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ పంచాయితి
తనకు మానస దూరం అవుతోందని గ్రహించిన రఖిల్ ఆమె వెంటపడి తనతో మాట్లాడలని, తనను ప్రేమించాలని వేధించాడని ఆరోపణలు ఉన్నాయి. రానురాను రఖిల్ టార్చర్ ఎక్కువ కావడంతో మానస కన్నూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మానస కుటుంబ సభ్యులు, రఖిల్ కుటుంబ సభ్యుల సమక్షంలో పంచాయితీ జరిగింది. రఖిల్ కుటుంబ సభ్యులు మనవి చెయ్యడంతో అతని మీద కేసు నమోదు చెయ్యకుండా స్వయంగా ఇంకోసారి ఇలా జరిగితే నిన్ను బోక్కలో వేస్తానని కన్నూర్ డీఎస్పీ రఖిల్ కు వార్నింగ్ ఇచ్చారు.
రగిలిపోయిన ప్రియుడి ఎంట్రీ
మానస తన మీద కేసు పెట్టి లేనిపోని రాద్దాంతం చేసిందని, ఆమెతో తాడోపేడో తేల్చుకోవాలని రఖిల్ డిసైడ్ అయ్యాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన రఖిల్ ఓ రివాల్వర్ తెప్పించుకున్నాడు. రివాల్వర్ జోబులో పెట్టుకున్న మాజీ ప్రియుడు రఖిల్ నేరుగా స్నేహితులో కలిసి నివాసం ఉంటున్న మాజీ గర్ల్ ఫ్రెండ్ మానస ఇంటికి వెళ్లాడు.
రూమ్ లో రచ్చరచ్చ
స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న మానస రఖిల్ ఎంట్రీతో షాక్ అయ్యింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు ?. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ కేకలు వేసింది. నీతో మాట్లాడాలని, ఒక్కసారి నామాట వినాలని రఖిల్ చెప్పాడు. రఖిల్ రావడంతో మానస స్నేహితులు అదే ఇంటిలోని పక్కరూమ్ లోకి వెళ్లారు. ఆ సమయంలో రఖిల్, మానసల మద్య మాటల యుద్దం జరిగిందని సమాచారం.
రివాల్వర్ తో కాల్చేసి ఆత్మహత్య చేసుకున్న మాజీ ప్రియుడు
మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన రఖిల్ జోబులో ఉన్న రివాల్వర్ తీసుకుని మానస మీద కాల్పులు జరిపాడు. బుల్లెట్లు దూసుకుపోవడంతో మానస కుప్పకూలిపోయింది. వెంటనే రఖిల్ కూడా అదే రివాల్వర్ తో కాల్చుకుని కుప్పకూలిపోయాడు. తుపాకి కాల్పుల శబ్దం వివనపడంలో పక్కరూమ్ లో ఉన్న మానస స్నేహితులు పరుగు తీసి చూడగా అప్పటికే ఇద్దరు రక్తపు మడుగులో పడిపోయారు.
Recommended Video
ప్రతీకార హత్యా..... వీడు శాడిస్టా ?
విషయం తెలుసుకున్న కొత్తమంగళం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రఖిల్ తీసుకెళ్లిన రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. రఖిల్ కు రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది ? ఎవరు ఇచ్చారు ?, అని పోలీసులు ఆరా తీస్తున్నారు. రఖిల్ మొబైల్ ఫోన్ లోని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పిందని రగిలిపోయిన రఖిల్ ప్రతీకారంతో మానసను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడా ?. లేకపోతే అతను శాడిస్టుగా తయారైనాడా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. డెంటల్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న మానస హత్యకు గురి కావడం కేరళతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
దంతవైద్య విద్యార్థిని మానస, రఖిల్ వ్యవహారంలో కొత్తకొత్త విషయాలు బయటకు వస్తున్నాయని కేసు విచారణ చేస్తున్న ఓ పోలీసు అధికారి అంటున్నారు. మానసతో పాటు కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు, ఆమెతో కలిసి నివాసం ఉంటున్న రూమ్ మెంట్స్ ను పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. మరో వైపు ఆ రోజే రఖిల్ ను అరెస్టు చేసి జైలుకు పంపించి ఉంటే మా కూతురు బతికుండేదని, ఇప్పుడు మా బిడ్డ ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారని, ఆ రోజు రఖిల్ తల్లిదండ్రుల మీద పోలీసులు జాలి చూపించడం వలనే జరగరానిది జరిగిపోయిందని మానస కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.