బిగ్ షాక్: సిలిండర్ బుకింగ్ గడువు 45 రోజులకు పెంపు!
దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సరఫరాలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం బుకింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. గతంలో రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కనీస నిరీక్షణ సమయాన్ని (Waiting Period) 21 రోజుల నుండి 25 రోజులకు పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువును ఏకంగా 45 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే, పట్టణ మరియు నగర ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతం ఉన్న 25 రోజుల నిబంధనే యథాతథంగా కొనసాగనుంది. ఈ వివక్షాపూరిత నిర్ణయంపై ఇప్పుడు గ్రామీణ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
గ్రామీణ ప్రాంతాల్లో వంటగ్యాస్ వినియోగంపై నియంత్రణ తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిమిత గ్యాస్ నిల్వలను ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయాలనేది ప్రభుత్వ వాదన. పట్టణాలతో పోలిస్తే పల్లెటూళ్లలో గ్యాస్ సిలిండర్ల డెలివరీ నెమ్మదిగా ఉండటం.. రవాణా ఖర్చులు పెరగడం కూడా ఈ నిర్ణయానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనివల్ల ఒక సిలిండర్ తీసుకున్న పల్లెటూరి కుటుంబం, రెండో సిలిండర్ కోసం కనీసం నెలన్నర రోజులు నిరీక్షించాల్సి ఉంటుంది.

సరఫరా గొలుసు విచ్ఛిన్నం!
అంతర్జాతీయంగా, ముఖ్యంగా పశ్చిమాసియాలో చోటుచేసుకున్న యుద్ధ మేఘాలు.. ఉద్రిక్తతలు భారతదేశ చమురు, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎర్ర సముద్రం మరియు హార్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో నౌకల రాకపోకలు మందగించడంతో, దేశీయంగా గ్యాస్ దిగుమతులు తగ్గి కొరత ఏర్పడింది. ఈ కృత్రిమ సహజ కొరతను బ్యాలెన్స్ చేయడానికి కేంద్రం వినియోగంపై ఆంక్షలు విధిస్తోంది. సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ 45 రోజుల నిబంధన అమల్లో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
మళ్లీ కట్టెల పొయ్యి వైపు..
ఈ కొత్త నిబంధన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పెద్ద కుటుంబాలకు పెను శాపంగా మారనుంది. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులున్న కుటుంబాలకు ఒక్క సిలిండర్ గరిష్ఠంగా 20 నుండి 25 రోజులకు మించి రాదు. అలాంటి వారు మిగిలిన 20 రోజులు వంట ఎలా చేయాలనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ క్రమంలో గ్యాస్ అయిపోతే ప్రత్యామ్నాయం లేక పల్లెల్లో ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంది. ఇది పర్యావరణపరంగానే కాకుండా, మహిళల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
సామాన్యుడి బడ్జెట్పై అదనపు భారం!
కేవలం బుకింగ్ గడువు పెరగడమే కాకుండా, మార్కెట్లో ఏర్పడిన గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ మార్కెట్ విక్రేతలు అధిక ధరలకు సిలిండర్లను విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 45 రోజుల గడువు వల్ల అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ కావాల్సిన వారు వేల రూపాయలు వెచ్చించి సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఉజ్వల యోజన వంటి పథకాల ద్వారా గ్యాస్ కనెక్షన్లు పొందిన పేద ప్రజలు, ఇప్పుడు గ్యాస్ దొరక్క మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సంచలన రిపోర్ట్:పెరిగిన నూడుల్స్ గిరాకీ, ప్యాకేజీ ఫుడ్కే జై -
LPG ATM: దేశంలోనే తొలిసారి. ఇక గ్యాస్ సిలిండర్ కూడా ఏటీఎంలోనే! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!














Click it and Unblock the Notifications