మధ్యప్రదేశ్ లో ఇండియా కూటమి పొత్తు విఫలం-ఎస్పీ స్ధానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల పోటీతో..!
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఇండియా కూటమి త్వరలో మధ్యప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్ధానాల విషయంలో ఇరు పార్టీల మధ్య సాగిన చర్చలు విఫలం కావడంతో పరస్పరం అభ్యర్ధుల్ని పోటీకి దింపుకుంటున్నాయి. దీంతో ఈ అవకాశాన్ని వాడుకుని పైచేయి సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
మధ్యప్రదేశ్లో ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య పొత్తుపై ఇప్పటివరకూ ఉన్న ఆశలు కాస్తా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనతో ఆవిరయ్యాయి. మధ్యప్రదేశ్లో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల మొదటి జాబితాలో ఎస్పీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ఏడు స్థానాల్లో నాలుగు స్థానాలకు పేర్లు ఉన్నాయి. దీంతో ఎస్పీ స్ధానాల్లో కాంగ్రెస్ అభ్యర్దుల ప్రకటన ఇండియా కూటమిలో చిచ్చుకు కారణమవుతోంది.

అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ.. తన ఇండియా కూటమి భాగస్వామికి తీవ్ర హెచ్చరికలు పంపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మరో తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన నాలుగు స్థానాల్లో చిత్రాంగి, మెహగావ్, భందర్ , రాజ్నగర్ ఉన్నాయి. 2018లో ఎస్పీ గెలిచిన ఛతర్పూర్లోని బిజావర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టడంతో సమాజ్వాదీ పార్టీ అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది.
అదే సమయంలో ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు రామాయణ్ సింగ్ కూడా కాంగ్రెస్ తో పొత్తు అవకాశాలకు తెరపడినట్లేనని ప్రకటించారు. తాము కాంగ్రెస్ నాయకత్వంతో కొంత మేరకు చర్చలు జరిపామని, కానీ వాటికి ఆదివారంతో తెరపడిందన్నారు. తాము సొంతంగా కొన్ని సీట్లలో పోటీ చేస్తామని, వచ్చే ఏడాది ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామన్నారు.
-
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్ఫర్డ్లో "ఏఐ" పై ప్రసంగం..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications