అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు: సుప్రీం కోర్టుకు కేసు: బదిలి చేసిన హైకోర్టు న్యాయమూర్తి !
అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ విచారణసుప్రీం కోర్టుకు బదిలి, ఐదు మంది న్యాయమూర్తులతో విచారణప్రభుత్వాన్ని కూల్చేస్తానంటున్న టీటీవీ దినకరన్, సీఎం ఇంటికే
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ విచారణ సుప్రీం కోర్టుకు చేరింది. మద్రాసు హైకోర్టు న్యాయస్థానం నుంచి పిటిషన్ విచారణ సుప్రీం కోర్టు చేతికి వెళ్లింది. టీటీవీ దినకరన్ గ్రూప్ లోని 18 మంది ఎమ్మెల్యేల మీద తమిళనాడు స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.
తమిళనాడు స్పీకర్ ధనపాల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ టీటీవీ దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి పిటిషన్ విచారణ జరుగుతోంది. గురువారం (నవంబర్ 2వ తేదీ) మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి రవిచంద్రబాబు పిటిషన్ విచారణ చేశారు.
ప్రభుత్వం, టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేల వాదనలు విన్నారు. అనంతరం రవిచంద్రబాబు సుప్రీం కోర్టుకు పిటిషన్ విచారణ బదిలీ చెయ్యాలని నిర్ణయించారు. సుప్రీం కోర్టులోని ఐదుగురు న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనం టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేల పిటిషన్ విచారణ చెయ్యాలని మనవి చేస్తూ లేఖ రాశారు.
టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేల పిటిషన్ విచారణ సుప్రీం కోర్టు చేతికి వెళ్లింది. ఈ సందర్బంగా టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అతి త్వరలోనే తమిళనాడు ప్రభుత్వం కుప్పకూలిపోతుందని జోస్యం చెప్పారు.