మహా కుంభమేళా: ‘కమల’గా పేరు మార్చుకున్న స్టీవ్ జాబ్స్ సతిమణి లారీన్ పావెల్
సాఫ్ట్వేర్ దిగ్గజం యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్ తన పేరును మార్చుకున్నారు. మహాకుంభ మేళాలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నగరానికి చేరుకున్న లారీన్ పావెల్ తన పేరును 'కమల'గా మార్చుకున్నారు. నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి మహరాజ్.. లారీన్ పావెల్ జాబ్స్కు కమల అని నామకరణం చేశారు.
లారీన్కు 'కమల' అని గత శుక్రవారం రోజే (జనవరి 10న) నామకరణం చేశామని కైలాసానంద గిరి మహరాజ్ తెలిపారు. ఆమె తనకు కూతురు లాంటిదని ఆయన అన్నారు. లారీన్ పావెల్ జాబ్స్ భారత్లో పర్యటించడం ఇది రెండోసారి అని చెప్పారు. వచ్చిన ప్రతీసారి ఆమె హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.

మెడిటేషన్ చేసేందుకు ఆమె తమ ఆశ్రమానికి వచ్చి వెళ్తుంటారని వెల్లడించారు. జనవరి 29వ తేదీ వరకు స్వామి కైలాసానంద గిరి మహరాజ్కు చెందిన ఆశ్రమంలోనే ఉంటూ మహాకుంభ మేళాకు సంబంధించిన వివిధ పూజా కార్యక్రమాల్లో కమల పాల్గొంటారని సమాచారం. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా కొనసాగనుంది.
#WATCH | Prayagraj, Uttar Pradesh: On former Apple CEO Steve Jobs' wife Laurene Powell Jobs, Spiritual leader Swami Kailashanand Giri says, "She is in my 'shivir'. She has never been to such a crowded place. She has got some allergies. She is very simple...All those people who… pic.twitter.com/1bQXP2lId7
— ANI (@ANI) January 14, 2025
కాగా, భారత్కు చేరుకున్న వెంటనే కమల (లారీన్ పావెల్ జాబ్స్) ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి వెళ్లారు. అక్కడ ఆమె మీడియాతో మాట్డుతూ.. 'మహాకుంభ మేళా ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని మహాదేవుణ్ని పూజించాను. విశ్వనాథుడిని కుంభమేళాకు ఆహ్వానించేందుకు నేను కాశీకి వచ్చాను' అని తెలిపారు.
Can you believe it? Steve Jobs' widow, Laurene Powell Jobs, is at the Maha Kumbh Mela!
— Divyank Rathod (@Divyank_Rathod) January 14, 2025
She even took on a Hindu name, "Kamala." Talk about a spiritual journey! #LaurenePowellJobs #LaurenePowell #MahaKumbhMela2025 #PrayagrajMahakumbh2025 #MahaKumbh2025
🧵 A Thread~ pic.twitter.com/MB0fyNIgnx
లారీన్ పావల్ జాబ్స్కు అస్వస్థత
మహా కుంభమేళాకు హాజరైన లారీన్ పావెల్ అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. కొత్త వాతావరణం కారణంగా ఆమె అస్వస్థతకు గురైనట్లు నిరంజనీ అఖాండాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి మహారాజ్ తెలిపారు. ప్రస్తుతం లారీన్ తాము ఏర్పాటు చేసిన శిబిరంలో చికిత్స తీసుకొంటున్నారని, ఆరోగ్యం కుదుటపడ్డాక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని వెల్లడించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications