Mahakumbh Mela 2025: నాగ సాధ్విలు - వారియర్స్, ఎన్నో ప్రత్యేకతలు..!!
మహాకుంభ మేళా ప్రారంభానికి ముహూర్తం సమీపిస్తోంది. ప్రయాగ్ రాజ్ కేంద్రంగా ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల ప్రముఖులు మహా కుంభ మేళా కోసం తరలి వస్తున్నారు. ప్రపంచంలో జరిగి మత పరమైన అది పెద్ద ఈవెంట్ గా ఈ మహా కుంభమేళా నిలుస్తుంది. జనవరి 13 న ప్రారంభమై ఫిబ్రవరి 26 న ముగిసే ఈ కుంభమేళాలో నాగసాధ్విల పాత్ర ప్రత్యేకం. అసలు ఎవరీ నాగసాధ్వీలు. హిందూ మత వారియర్స్ గా వారి పాత్ర ఏంటి.
హిందూ వారియర్స్
మహాకుంభ మేళా ఈ సారి చరిత్రలో నిలిచిపోనుంది. ఆ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేల కోట్ల ఖర్చుతో దాదాపు 45 కోట్ల మంది భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కుంభమేళా ద్వారా దాదాపు రెండు లక్షల కోట్ల వరకు టర్నోవర్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. కుంభమేళా అంటే అందరికీ గుర్తొచ్చేది నాగసాధువులు. కానీ, మహిళా నాగసాధువులు గురించి చాలా తక్కువ మందికే అవగాహన ఉంటుంది. వీరినే నాగసాధ్వీలుగా పిలుస్తారు. హిందూ మత వారియర్స్ గా నిలిచే ఈ నాగసాధ్వీలు శివుడిని ఆరాధిస్తారు. కుంభమేళాలో వీరి పాత్ర ప్రచారానికి దూరంగా ఉన్నా.. కీలకంగా వ్యవహరిస్తారు.

ఆశ్రమాలే ఆవాసాలుగా
ఈ నాగసాధ్వీలు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం ప్రాపంచిక ఆస్తులు, వ్యక్తుల మధ్య సంబంధాలను వదులుకున్న వారే ఉంటారు. పుణ్య క్షేత్రాలు.. కుంభమేళాల్లో తరచూ సంచరిస్తారు. ఈ నాగసాధ్వీ లు తమ జీవితం మొత్తం ధ్యానం, యోగా, ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాలకు అంకితం చేస్తారు. ఆడంబరాలకు దూరంగా ఉంటూ..బ్రహ్మచర్యం వంటి ప్రతిజ్ఞలను కఠినంగా పాటిస్తుంటారు. ఆధ్యాత్మికత, దృఢత్వం వారి బలం. ఆధ్యాత్మిక చింతనపై కేంద్రీకృతమై సరళమైన జీవితాన్ని గడపుతుంటారు. తరచుగా గుహలు లేదా ఆశ్రమాలే వారికి ఆవాసాలుగా ఉంటాయి. తమ జీవితాన్ని శివుడిని ఆరాధించడానికి అంకితం చేస్తారు.
విలక్షణ శైలి
నాగసాధ్వీల వస్త్ర ధారణ.. శైలి విలక్షణంగా ఉంటుంది. తిలకం, డ్రెడ్లాక్లు వారి 'గంటి' (కుంకు మపువ్వు కుట్టని వస్త్రం) వస్త్రధారణతో కనిపిస్తూ ఉంటారు. కఠినమైన దీక్షా విధానాన్ని ఆచరిస్తారు.
సన్యాసి సమాజంలో ఈ మహిళా నాగ సాధువులు సమానత్వాన్ని ప్రోత్సహిస్తారు. స్త్రీ శక్తి, ఆధ్ యాత్మిక స్వేచ్ఛ చిహ్నాలుగా పనిచేస్తారు. అఖారాలలో లేదా సన్యాసులలో, మహిళా నాగ సాధు వులు తమ మతాన్ని స్వీకరించి వారి నియమాలను ఆచరిస్తారు. కుంభమేళాలో వీరు ఊరేగింపులు నిర్వహిస్తూ..షాహీ స్నాన్ లో పాల్గొంటారు. వీరిలో కొందరిని మాతా అని సంభోదిస్తారు. మహా కుంభ మేళా లో ఈ సారి నాగ సాధ్వీల రాక పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications