స్వచ్ఛ భారత్: ముంబైలో ఫడ్నవీస్, బారామతిలో పవార్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం ముంబైలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా రోడ్లు, మార్కెట్లు, పబ్లిక్ ప్రదేశాల్లో చెత్తా చెదారం తొలగించడానికి, శుభ్రం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రొత్సహించాలని ఫడ్నవీస్ పేర్కొన్నారు.
స్వచ్ఛ భారత్ ద్వారా 2019లో గాంధీజీ 150వ జయంతి వరకు భారతదేశం పరిశుభ్రంగా మారుతుందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Maharashtra CM Devendra Fadnavis participate in a cleanliness drive in Mumbai <a href="http://t.co/Yy1ayjynJc">pic.twitter.com/Yy1ayjynJc</a></p>— ANI (@ANI_news) <a href="https://twitter.com/ANI_news/status/533099840142450688">November 14, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>మోడీ స్వచ్ఛ భారత్లో పాల్గొన్న శరద్ పవార్

మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికి, అవిశ్వాస పరీక్ష నెగ్గేందుకు ఎన్సీపీ సహకరించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ చీపురు పట్టారు.
శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలె, కుటుంబసభ్యులు, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, పార్టీ జనరల్ సెక్రెటరీతో కలసి తన సొంత ఊరు బారామతిలో రోడ్డు శుభ్రం చేశారు. అనంతరం మాట్లాడుతూ, "ఈ రోజు నుంచి మేము పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించాం" అని పవార్ చెప్పారు.












Click it and Unblock the Notifications