హైవేపై కారు నుంచి మంటలు.. వెంటనే ఆపిన మహారాష్ట్ర సీఎం, అండగా
మహారాష్ట్ర సీఎం తన మంచి మనస్సును చాటుకున్నారు. రోడ్డుపై వెళుతుండగా.. ఓ కారుకు మంటలు అంటుకున్నాయి. దీంతో తన కారును ఆపి మరీ.. ఆ కారు డ్రైవర్తో మాట్లాడాడు. తగింత సాయం చేస్తానని మాట ఇచ్చాడు. సీఎం తన కారును ఆపి.. దగ్గరకు వెళ్లాడు. సాయం చేస్తానని మాట కూడా ఇచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ముంబై వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవే మీద మంగళవారం ఉదయం తెల్లవారుజామున సీఎం కాన్వాయ్ వెళుతుంది. అయితే వీలేపార్లే ప్లై ఓవర్ మీద టాయోట ఫార్చూనర్ కారుకు తగలబడి కనిపిస్తోంది. ప్రమాదానికి సంబంధించి రాత్రి 12.25 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి రెండు ఫైరింజన్లు చేరుకున్నాయి.
ఆ వైపు నుంచి వెళుతున్న షిండే తన కారును ఆపారు. ఆ తగలబడుతున్న కారు వద్దకు వెళ్లారు. ఆ డ్రైవర్ విక్రాంత్ షిండేతో మాట్లాడారు. కారు సమీపంలోకి వెళ్లొద్దని. .అలాగే వీలయినంత సాయం చేస్తానని తెలిపారు. వారికి వీలే పార్లే పోలీస్ స్టేషన్ సిబ్బంది తగిన సాయం చేస్తారన తెలిపారు.