విమానాశ్రయానికి భూములివ్వం.. వాహనాలకు నిప్పు, ఉద్రిక్తం
మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్ నగరంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్టు నిర్మించేందుకు భూసేకరణకు సిద్ధమైంది.
ముంబై: మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్ నగరంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్టు నిర్మించేందుకు భూసేకరణకు సిద్ధమైంది.
కానీ ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కుంటోందని, విమానాశ్రయానికి తమ భూములను ఇచ్చేది లేదని రైతులు చెప్పారు. ప్రభుత్వం దిగిరాలేదు. దీంతో రైతులు గురువారం రోడ్డెక్కారు.

థానే-బదలాపూర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. పలు వాహనాలకు, టైర్లకు నిప్పు పెట్టారు. రోడ్డుపై వాహనాలను అడ్డుకున్నారు.
దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించింది. థానేకు అదనపు భద్రతా బలగాలను పంపించింది. ఈ ఘటనలో పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications