సాముహిక లైంగికదాడికి గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ... అనంతలోకాలకు....
ముంబై : వారు ఆమె స్నేహితులు. ఫ్రెండ్ బర్త్ డే కదా అని ఇంటికి ఆహ్వానించారు. కేక్ కోయించి .. ఇక తమ పని కానిచ్చేశారు. తన నేస్తాలే తనపై లైంగికదాడికి తెగబడుతుంటే .. ఆ మైనర్ బాలిక నివ్వేరపోయింది. ఒక్కసారిగా షాక్నకు గురయ్యింది. ఒకరి వెనక ఒకరు నలుగురు లైంగికదాడి చేశారు. ఆ యువతి నిశ్చేష్టురాలై .. మూర్చపోయింది. అయినా ఆ మృగాళ్లు లైంగికదాడి చేశారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తర్వాత ఆస్పత్రిలో చేర్చడంతో .. చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె తీవ్ర గాయాలతో కాసేపటి క్రితం మృతిచెందారని వైద్యులు పేర్కొన్నారు.
ఒంటరిగా ఉన్నానని ఫోన్ చేసింది..!ఊపుకుంటూ వెళ్లాడు..!మరో నలుగురితో కలిసి ఊడ్చిపారేసింది..!!
ముంబై శివారుకు చెందిన 19 ఏళ్ల మైనర్ బాలికపై గత నెలలో లైంగిక దాడి జరిగింది. జూలై 7న యువతి బర్త్ డే ఉంది. ఇంకేముంది ఆమె స్నేహితులు ఒకరు తమ ఇంటికి ఆహ్వానించారు. నలుగురు స్నేహితులు .. యువతి ఇంటికెళ్లారు. అక్కడ కూడా ఆమెకు అనుమానం రాలేదు. వారంతా కలిసి .. బర్త్ డే కేక్ కోశారు. తర్వాత తమ బుద్దిని బయటపెట్టారు. ఆమెపై ఒక్కొక్కరు లైంగికదాడి చేశారు. తెల్లవారు ఆమె ఇంటికెళ్లిపోయారు. ఈ విషయం పేరెంట్స్కు చెప్పినప్పటికీ వారు ముంబై పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదు. తర్వాత ఆమె షాక్నకు గురై .. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో వైద్యులు ట్రీట్మెంట్ ప్రారంభించాక అసలు విషయం వెలుగుచూసింది. దీంతో బాధితురాలు తరఫున కేసు నమోదు చేశారు.
ఆస్పత్రిలో చావుతో మైనర్ బాలిక పోరాడింది. చివరికి బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్యను మహారాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని చునభాట్టి పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఎన్సీపీ కూడా లైంగికదాడి ఘటనను నిరసిస్తూ ఆందోళన చేపట్టింది. చునభట్టి పీఎస్ వద్ద నిరసన చేపట్టింది.