పవార్ల చేతిలో పవర్: సీఎం ఎవరో డిసైడ్ చేసేది వాళ్లే..
Maharashtra Assembly elections polling 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ సజావుగా జరుగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు.
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలికవర్గం నాయకుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్.. ప్రారంభంలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో గవర్నర్ ఓటు వేశారు. రాజ్భవన్.. ముంబైలోని కొలాబా అసెంబ్లీ నియోజకవర్గంలో పరిధిలోకి వస్తుంది.

#WATCH | Nagpur, Maharashtra: RSS Chief Mohan Bhagwat says, "In a democracy, voting is a citizen's duty. Every citizen should perform this duty. I was in Uttaranchal, but I came here last night to cast my vote. Everyone should vote..."#MaharashtraAssemblyElections2024 https://t.co/TPje6eCYg2 pic.twitter.com/U6ePRamY7f
— ANI (@ANI) November 20, 2024
బారామతి నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అజిత్ పవార్. ఇది ఆయన సొంత నియోజకవర్గం. ఇక్కడి నుంచి వరుసగా ఏడుసార్లు ఘన విజయం సాధించారాయన. ఎనిమిదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. శరద్ పవార్ వర్గం నేషనలిస్ట్ పార్టీ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటోన్నారు. యుగేంద్ర పవార్తో తలపడుతున్నారు.
ఓటు వేసిన అనంతరం అజిత్ పవార్ విలేకరులతో మాట్లాడారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. వచ్చేది మహాయుటి ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. మరోసారి సుపరిపాలనను అందించబోతోన్నామని పేర్కొన్నారు. మహా వికాస్ అఘాడీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
#WATCH | Baramati: Maharashtra Deputy CM and NCP candidate from Baramati Assembly constituency, Ajit Pawar shows his inked finger after casting his vote for #MaharashtraElection2024
— ANI (@ANI) November 20, 2024
He says "Mahayuti is going to form the government here..." pic.twitter.com/oGsCBMMbsL
నాగ్పూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలను అతిపెద్ద పండగగా భావిస్తామని, ప్రతి ఒక్కరూ ఇందులో పాలుపంచుకోవాలని విజ్ఞప్తిచేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తాను ఉత్తరాఖండ్లో ఉన్నప్పటికి ఓటు వేయడానికే వచ్చానని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో పవార్ కీలక పాత్రను పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. అటు శరద్ పవార్, ఇటు అజిత్ పవార్.. ఏ కూటమికి మద్దతు ఇస్తే వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారనేది స్పష్టమౌతోంది. నంబర్ గేమ్లో అజిత్ పవార్ మహాయుటి కూటమిలో, శరద్ పవార్, మహా వికాస్ అఘాడీలో కీలకం మారారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications