Maharashtra Jharkhand Assembly Election Results 2024: 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడత, 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది.అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. మూడు రోజుల సస్పెన్స్కు నవంబర్ 23వ తేదీ ఉదయం 8 గంటల నుంచి తెరపడింది.
మహారాష్ట్రలో పోరు ప్రధానంగా అధికారిక మహాయుతి కూటమి (బీజేపీ,అజిత్ పవార్ ఎన్సీపీ,ఏక్నాథ్ షిండే శివసేన) మహా వికాస్ అగాఢీ కూటమి( కాంగ్రెస్,ఉద్ధవ్ థాక్రే శివసేన,శరద్ పవార్ ఎన్సీపీ)ల మధ్యే జరిగింది. ఇక జార్ఖండ్లో మాత్రం అధికారిక జేఎంఎం, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మధ్య పోటీ జరిగింది. జేఎంఎం తిరిగి అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేస్తుండగా... అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం ఎన్డీయే వైపే మొగ్గు చూపాయి. మహారాష్ట్రలో మాత్రం దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ మహాయుతి కూటమే అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి.ఇక మహారాష్ట్ర, జార్ఖండ్తో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు లైవ్లో మీకోసం.
9:02 AM, 24 Nov
మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రభావం ఉందన్న కేకే సర్వే.
12:21 AM, 24 Nov
మహారాష్ట్రలో మహాయుతి అనూహ్య విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీని ఘనంగా సత్కరించారు.
Defence Minister Rajnath Singh tweets, "Prime Minister Narendra Modi was felicitated at the BJP Headquarters today on the grand victory of the NDA in Maharashtra under his leadership. Modiji has made the NDA synonymous with development and good governance. The massive and… pic.twitter.com/VmLfGgIPS5
ఏపీ, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం, హర్యానాతో పాటు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఖాతా ఖాళీ అయింది -మోడీ
12:10 AM, 24 Nov
సీఎంలను తీసుకొచ్చి ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హామీలు అమలుచేయలేదు. అందుకే జనం కాంగ్రెస్కు ఓటు వేయలేదు- ప్రధాని మోడీ
10:54 PM, 23 Nov
ప్రజలు నేషన్ ఫస్ట్ అనేవారితోనే ఉన్నారని.. కుర్చీకి ప్రాధాన్యత ఇచ్చేవారిని దూరం పెట్టారన్నారు మోడీ.
Voter is with spirit of 'Nation First', not with those who dream of 'chair first': PM Modi on Maharashtra poll outcome
Delhi: PM Narendra Modi says, "...The Congress family cannot live without power. It can do anything to win elections. Today, urban Naxalism of Congress has become a new challenge for India. The remote control of urban Naxalites is outside the country and that is why… pic.twitter.com/oT9DQzS6o8— ANI (@ANI) November 23, 2024
10:51 PM, 23 Nov
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పరాన్న జీవిగా మారిందంటూ ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.
Delhi: PM Narendra Modi says, "Congress party has now become 'parjeevi' in the country's politics. It is becoming increasingly difficult for them to form a group on their own. They have been wiped out in Andhra Pradesh, Sikkim, Haryana and today in Maharashtra. Congress'… pic.twitter.com/jKCU9jRO1z— ANI (@ANI) November 23, 2024
10:50 PM, 23 Nov
మహారాష్ట్రలోని తన నివాసం చేరుకున్న డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.
Delhi: PM Narendra Modi says, "The people of Maharashtra also saw how the Congress government is betraying the people in Karnataka, Telangana and Himachal. You will also see this in Punjab...Today there is another message of the mandate of Maharashtra. Only one… pic.twitter.com/K7NrLDSi8x— ANI (@ANI) November 23, 2024
9:59 PM, 23 Nov
కులం, మతం, ప్రాంతం, భాష పేర్లతో ప్రజలను వేరు చేస్తున్నవారికి తగిన గుణపాఠం చెప్పారు. దళితులు, గిరిజనులు, బీసీలు ఎన్డీఏకు మద్దతు పలికారన్నారు ప్రధాని మోడీ.
Delhi: PM Narendra Modi says, "..The sentiment of 'Ek hain toh safe hain' has taught a lesson to those who make people fight in the name of caste, religion, language and region. It has punished them. Tribals, OBCs, Dalits, every section of the society voted for BJP-NDA.… pic.twitter.com/PHhoWAzPo7— ANI (@ANI) November 23, 2024
9:57 PM, 23 Nov
రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించాలని చూసింది. రెండు రాజ్యాంగాలు ఉండాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు- ప్రధాని మోడీ
9:49 PM, 23 Nov
మహారాష్ట్రలో అన్ని రికార్డులు బ్రేకయ్యాయని, గత 50 యాభై ఏళ్లలో ఇలాంటి విజయం నమోదు కాలేదని అన్నారు ప్రధాని మోడీ.
Delhi: PM Narendra Modi says, "This time Maharashtra has broken all records. This is the biggest victory for any party or pre-poll alliance in Maharashtra in the last 50 years. This is the third consecutive time that Maharashtra has blessed the alliance led by BJP. For… pic.twitter.com/Qg3bj01pNy— ANI (@ANI) November 23, 2024
9:29 PM, 23 Nov
హర్యానా తర్వాత మహారాష్ట్రలో ఎన్డీఏకు ప్రజలు మహా విజయాన్ని అందించారన్నారు ప్రధాని మోడీ. ఇప్పుడు ఏక్ హే తో సేఫ్ అనేది మహా మంత్రమని వ్యాఖ్యానించారు.
Delhi: PM Narendra Modi says, "The people of Maharashtra also saw how the Congress government is betraying the people in Karnataka, Telangana and Himachal. You will also see this in Punjab...Today there is another message of the mandate of Maharashtra. Only one… pic.twitter.com/K7NrLDSi8x— ANI (@ANI) November 23, 2024
9:24 PM, 23 Nov
కాంగ్రెస్ నేతలారా చెవులు రిక్కించి వినండి. ప్రపంచంలో ఏ శక్తీ ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురాలేదు అని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు.
Top Fight - Latur Rural
రమేష్ కరాడ్
(బీజేపీ)
Won
ధీరజ్ విలాస్రావ్ దేశ్ముఖ్
(కాంగ్రెస్)
Lost
9:18 PM, 23 Nov
బీహార్ తోపాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లోనూ ప్రజలు ఎక్కువ స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులకే పట్టం కట్టారని మోడీ అన్నారు.
Delhi: PM Narendra Modi says, "Today the results of by-elections of many states have also come... Uttar Pradesh, Uttarakhand and Rajasthan have given strong support to BJP. The people of Assam have once again expressed their trust in BJP. We have also got success in… pic.twitter.com/r6wEEvorQI— ANI (@ANI) November 23, 2024
Top Fight - Latur City
అమిత్ విలాస్రావ్ దేశ్ముఖ్
(కాంగ్రెస్)
Won
అర్చన పాటిల్ చాకుకర్
(బీజేపీ)
Lost
Top Fight - Karjat jamkhed
రోహిత్ పవార్
(ఎన్సీపీ (ఎస్పీ))
Won
రాం షిండే
(బీజేపీ)
Lost
Top Fight - Dhanwar
బాబూలాల్ మరాండి
(బీజేపీ)
Won
నిజాముద్దీన్ అన్సారీ
(జేఎంఎం)
Lost
Top Fight - Kamthi
చంద్రశేఖర్ బవాన్కులే
(బీజేపీ)
Won
సురేేష్ భోయార్
(కాంగ్రెస్)
Lost
Top Fight - Jamshedpur West
సరయూ రాయ్
(జేడీయూ)
Won
బన్న గుప్తా
(కాంగ్రెస్)
Lost
Top Fight - Ghansawangi
హిక్మత్ ఉధాన్
(ఎస్హెచ్ఎస్)
Won
రాజేేష్ టోపే
(ఎన్సీపీ (ఎస్పీ))
Lost
Top Fight - Dindoshi
సునీల్ ప్రభు
(ఎస్హెచ్ఎస్ (యూబీటీ))
Won
సంజయ్ నిరుపం
(ఎస్హెచ్ఎస్)
Lost
Top Fight - Bhokardan
సంతోష్ దన్వే
(బీజేపీ)
Won
చంద్రకాంత్ దన్వే
(ఎన్సీపీ (ఎస్పీ))
Lost
Top Fight - Bhokar
సృజయ చవాన్
(బీజేపీ)
Won
తిరుపతి కదం కొండేకర్
(కాంగ్రెస్)
Lost
READ MORE
10:19 PM, 22 Nov
మరికొన్ని గంటల్లో తేలనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అభ్యర్థుల భవితవ్యం
10:20 PM, 22 Nov
నవంబర్ 23 శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల కౌంటింగ్
10:22 PM, 22 Nov
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంటున్నారు.జార్ఖండ్లో కూడా తమ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు
11:11 PM, 22 Nov
మహారాష్ట్రతో పోలిస్తే 2019లో జార్ఖండ్ అంచనాలు మెరుగ్గా ఉన్నాయి.
రాష్ట్రంలోని 81 స్థానాల్లో JMM-కాంగ్రెస్-రాష్ట్రీయ జనతాదళ్ కూటమి 41 స్థానాలను గెలుచుకుంటుందని సగటున మూడు సర్వేలు 2019లో అంచనా వేశాయి
5:41 AM, 23 Nov
మహారాష్ట్ర
288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 20వ తేదీన జరిగిన పోలింగ్. ఈ ఉదయం 8 గంటలకు ఓట్లను లెక్కించనున్న ఎన్నికల సిబ్బంది: కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు
5:42 AM, 23 Nov
జార్ఖండ్
81 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13, 20వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్. ఈ ఉదయం 8 గంటలకు ఓట్లను లెక్కించనున్న ఎన్నికల సిబ్బంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు.
5:59 AM, 23 Nov
మహారాష్ట్ర
ముంబై మాహిమ్లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పోలీసుల పహారా. ఈ ఉదయం 8 గంటలకు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆరంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తెరుస్తారు.
వాయనాడ్ లోక్సభ కోసం జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ఆరంభం కానుంది. వాయనాడ్ నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
#WATCH | Kerala: Counting for #Wayanad Lok Sabha by-elections to take place today. The constituency saw a contest between Congress' Priyanka Gandhi Vadra and BJP's Navya Haridas.
బారామతిలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలికవర్గం అభ్యర్థిగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇక్కడ పోటీ చేశారు. ఆయనపై మహా వికాస్ అఘాడీ తరఫున యుగేంద్ర శ్రీనివాస్ పవార్ బరిలో దిగారు.
#WATCH | Counting for #MaharashtraElection2024 to take place today. The fate of candidates on all 288 Assembly seats to be decided. Visuals from a counting centre for Baramati Assembly constituency.
ఇంకాస్సేపట్లో ఓట్ల లెక్కింపు ఆరంభం కాబోతోన్న నేపథ్యంలో ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించిన శివసేన అభ్యర్థి షైనా ఎన్సీ. ముంబా దేవి నియోజకవర్గం నుంచి ఆమె పోటీలో నిలిచారు.
ఈ ఎన్నికల్లో మేమే అధికారంలోకి రాబోతోన్నాం. 51 స్థానాలతో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. జేఎంఎం- కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది- బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ
#WATCH | Ranchi | On election results, Jharkhand BJP president Babulal Marandi says, "We are sure that we will form the govt with BJP led NDA will get more than 51 seats. People have voted for NDA as they are fed up with the current government's corruption..." pic.twitter.com/tFmAWMpRJ0
మహాయుటి అభ్యర్థుల తరఫున పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠత. అక్కడి ఫలితాలు ఎలా ఉంటాయనే విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర వాతావరణం నెలకొంది.
8:01 AM, 23 Nov
జార్ఖండ్
24 జిల్లాల్లో 24 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఉదయం 8 నుంచి 8:30 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తాం. ఆ తరువాత ఈవీఎంలను ఓపెన్ చేస్తాం. తొలి రౌండ్ ఫలితం 9:30 గంటలకు వెలువడొచ్చు- ఎన్నికల ప్రధానాధికారి కే రవికుమార్.
8:06 AM, 23 Nov
మహారాష్ట్ర
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయకుడి ఆలయాన్ని సందర్శించిన శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) అభ్యర్థి మహేష్ సావంత్. మాహిమ్ స్థానం నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు.
8:11 AM, 23 Nov
మహారాష్ట్ర
ఎన్నికల కౌంటింగ్కు ముందు దిందోషి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి (మహాయుతి) సంజయ్ నిరుపం ప్రముఖ సిద్ధి వినాయక ఆలయంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన గెలుపుపై కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు
8:16 AM, 23 Nov
మహారాష్ట్ర
మహావికాస్ అగాఢీ కూటమి అభ్యర్థుల నుంచి గెలుపు గుర్రాలకు సంబంధించిన డిజిటల్ సంతకాలను సేకరించింది. ఇది భవిష్యత్తులో ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, లేదా అఫిడవిట్ల కోసం ఉపయోగపడుతుందని కూటమి పేర్కొంది
8:18 AM, 23 Nov
గెలుపుపై ధీమా..నోరు తీపిచేసేందుకు జిలేబీ రెడీ
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జిలేబి తయారు చేయిస్తున్న దృశ్యాలు
#WATCH | Jalebis being prepared at BJP headquarters in Delhi, on votes counting day for Maharashtra and Jharkhand elections pic.twitter.com/MnZubGrLO9
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇంటర్నెట్ను సస్పెండ్ చేయాలని ఈసీని కోరిన జేఎంఎం పార్టీ
8:35 AM, 23 Nov
భారతీయ జనతా పార్టీ (బిజెపి) మహారాష్ట్ర, జార్ఖండ్ రెండింటిలోనూ ముందస్తు ఆధిక్యం సాధించింది. జార్ఖండ్లో ఆ పార్టీ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మహారాష్ట్రలో కాషాయదళం 25 స్థానాల్లో ముందంజలో ఉంది.
8:40 AM, 23 Nov
మహారాష్ట్రలో కొనసాగుతోన్న కౌంటింగ్.
8:45 AM, 23 Nov
వాయనాడ్ లో ప్రియాంక గాంధీ ముందంజ.
8:49 AM, 23 Nov
శివసేనకు చెందిన సంజయ్ నిరుపమ్ సిద్ధివినాయకుని ఆలయాన్ని సందర్శించారు. మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని అన్నారు.
8:53 AM, 23 Nov
మహారాష్ట్ర, ఝార్ఖండ్లో గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న బీజేపీ నేతలు.
8:57 AM, 23 Nov
పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్లోని నైహతి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
9:06 AM, 23 Nov
20 వేలకు ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోన్న ప్రియాంక గాంధీ.
9:12 AM, 23 Nov
మహారాష్ట్రలో ముందంజలో ఎన్టీఏ కూటమి.
9:17 AM, 23 Nov
రెండు రాష్ట్రాల్లో మెజార్టీ స్థానాల్లో బీజేపీ కూటమిదే ఆధిక్యం