ఇరాన్ పోరాటం భారత్ కు నేర్పుతున్న పాఠం..! టీఎంసీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..!
అమెరికాతో ఆరు వారాల పాటు సాగిన ఇరాన్ వార్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ఏకపక్షంగా ప్రారంభించిన యుద్ధం ఎట్టకేలకు ఆగింది. ఈ ఆరు వారాల్లో ఇరాన్ ను తక్కువ అంచనా వేసిన అమెరికా-ఇజ్రాయెల్ కు చుక్కలు కనిపించాయి. దీంతో పదే పదే ఒప్పందం చేసుకోవాలంటూ ఇరాన్ ను బెదిరించిన ట్రంప్.. చివరికి కాల్పుల రెండు వారాల విరమణను ప్రకటించారు. ఈ సందర్భంగా యుద్ధంలో ఇరాన్ పోరాడిన తీరు ప్రపంచ దేశాల్ని ఆకట్టుకుంది.
ఇదే క్రమంలో ఇరాన్ కు సహజమిత్రదేశమైన భారత్ కూడా ఈ యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకోవాలనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చౌకైన షాహెద్ డ్రోన్లతో అమెరికా యుద్ద విమానాలను నేలకూల్చిన ఇరాన్ యుద్ధ తంత్రం ఇప్పుడు భారత్ సహా ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో కేంద్రం కూడా ఇప్పటికే డ్రోన్ల అప్ గ్రేడ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు అమెరికా వంటి అగ్రదేశంపై ఇరాన్ పోరాడిన తీరుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ప్రశంసల జల్లు కురిపించారు.

Iran has taught the world what courage & having a spine is all about. Perhaps our own leadership should now deal with bullies firmly. India should announce our own ceasefires, our own trade deals & our own energy policies. Jai Hind.
— Mahua Moitra (@MahuaMoitra) April 8, 2026
ధైర్యం, వెన్నెముక ఉండటం అంటే ఏమిటో ఇరాన్ ప్రపంచానికి నేర్పిందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్ చేశారు. బహుశా ఇప్పుడు మన నాయకత్వం కూడా దౌర్జన్యపరులను దృఢంగా ఎదుర్కోవాలని ఆమె కోరారు. భారతదేశం మన స్వంత కాల్పుల విరమణలను, వాణిజ్య ఒప్పందాలను, ఇంధన విధానాలను ప్రకటించాలని మొయిత్రా సూచించారు. గతంలో పాకిస్తాన్ తో కాల్పుల విరమణ సందర్భంగా ట్రంప్ జోక్యం చర్చనీయాంశమైన నేపథ్యంలో టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
-
అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ మధ్యవర్తి పాక్ కాదా ? అసలు బ్రోకర్ ఎవరంటే ? -
భారతీయులకు గండం! కేంద్రం రెడ్ అలర్ట్. రంగంలోకి ఎంబసీ. -
US Iran: గెలుపు ఎవరిది? అసలు ఇస్లామాబాద్లో ఏం జరగబోతోంది? -
ట్రంప్ డెడ్ లైన్ ముగుస్తున్న వేళ రోడ్లపైకి ఇరాన్ ప్రజలు- ఏం చేస్తున్నారంటే ? -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం! -
ట్రంప్ స్ధానంలో తెలుగింటి అల్లుడు ? అమెరికాలో మారుతున్న లెక్కలు..! -
కోటీ 40 లక్షల మంది ఆత్మత్యాగానికి రెడీ-ట్రంప్ డెడ్ లైన్ వేళ ఇరాన్ అధ్యక్షుడి షాకింగ్..! -
అమెరికాతో 45 రోజుల సీజ్ ఫైర్? ఇరాన్ కీలక షరతు-పాక్ మధ్యవర్తిత్వం..! -
రానున్న 12 గంటలు రైలులో ప్రయాణం చేయకండి: ప్రజలకు కీలక హెచ్చరికలు -
ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకం: ట్రంప్ సంచలనం -
"ఈ రాత్రితో ఇరాన్ నాగరికత సమాప్తం"-ఐరాస హెచ్చరికల్నీ లెక్కచేయని ట్రంప్..! -
ఇరాన్ భూస్థాపితం..?? ఆ దేశంపై ట్రంప్ అణు బాంబ్..!! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..! -
Revanth Reddy:కేరళం గడ్డపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..ఇద్దరి మధ్య సీక్రెట్ డీల్..!! -
ఏపీలో ఆ ఉద్యోగులకు 9, 23న పెయిడ్ హాలిడేలు..! రీజన్ ఇదే..!











Click it and Unblock the Notifications