Vande Bharat 4.0: త్వరలో వందే భారత్ 4.0-రైల్వే మంత్రి కీలక ప్రకటన..!

పాత రైల్వే పెట్టెలు, ఇంజన్ల స్ధానంలో భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తోంది. దీంతో మరిన్ని కొత్త మార్గాల్లో ఈ స్పెషల్ రైళ్లు ప్రవేశపెట్టడంతో పాటు స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మరో సంచలన ప్రకటన చేశారు. త్వరలో వందే భారత్ 4.0ను అభివృద్ధి చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

వందే భారత్ 4.0

దేశీయ మరియు ఎగుమతి రైలు పెట్టెల డిమాండ్‌ను తీర్చడం లక్ష్యంగా వందే భారత్ 4.0 అభివృద్ధితో భారతదేశం రైల్వే ఆధునీకరణలో ఒక పెద్ద పురోగతిని సిద్ధం చేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇవాళ జరిగిన 16వ అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా అన్నారు.తర్వాత తరం వందే భారత్ 4.0 సాంకేతికత, ప్రయాణీకుల సౌకర్యాలలో వరల్డ్ క్లాస్ బెంచ్‌మార్క్‌ను ఇది నిర్దేశిస్తుందన్నారు.

Major Announcement Vande Bharat 4 0 development Soon Says Railway Minister Ashwini Vaishnaw

ప్రత్యేకతలు ఇవే

అప్‌గ్రేడ్ చేసే వందే భారత్ 4.0 రైలులో మెరుగైన టాయిలెట్లు, మెరుగైన సీటింగ్ , మెరుగైన కోచ్ పనితనం ఉంటాయని రైల్వే మంత్రి తెలిపారు. రాబోయే 18 నెలల్లో దీనిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వందే భారత్ 3.0 ఇప్పటికే అంతర్జాతీయ రైళ్లతో పోటీ పడుతోంది. జపాన్, యూరప్‌లోని రైళ్ల కంటే 52 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. అదే సమయంలో తక్కువ శబ్దం, కంపనాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తామని రైల్వే మంత్రి తెలిపారు.

అమృత్ భారత్ 4.0

వందే భారత్ 4.0 తో పాటు, బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌ల మాదిరిగానే ప్రత్యేకమైన హై-స్పీడ్ ప్యాసింజర్ రైలు కారిడార్‌లను అభివృద్ధి చేస్తామని రైల్వే మంత్రి తెలిపారు. గరిష్టంగా గంటకు 350 కి.మీ వేగంతో ప్రయాణించడానికి వీటిని రూపొందిస్తారు. ఈ కారిడార్లు వికసిత్ భారత్ కింద 2047 నాటికి దాదాపు 7వేల కి.మీ ప్రత్యేక మార్గాలను నిర్మించే ప్రణాళికలో భాగం. అలాగే అమృత్ భారత్ రైళ్లను కూడా వెర్షన్ 4.0కి అప్‌గ్రేడ్ చేస్తున్నారు. కొత్త తరం కోచ్‌లు, పుష్-పుల్ లోకోమోటివ్‌లు రాబోయే 36 నెలల్లో పరీక్షకు సిద్ధంగా ఉన్నాయి. భద్రత పరంగా మన స్వదేశీ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ అయిన కవచ్ 4.0 ని అమలు చేస్తున్నారు. అయితే కవచ్ 5.0 350 కి.మీ. వేగంతో నడిచే రైళ్లకు సపోర్ట్ చేయనుంది.

Major Announcement Vande Bharat 4 0 development Soon Says Railway Minister Ashwini Vaishnaw

హైడ్రోజన్ రైళ్లు

పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన 2400-హార్స్‌పవర్ హైడ్రోజన్-శక్తితో నడిచే రైలును కూడా తయారు చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. ఇందులో ప్రపంచ స్దాయి నాణ్యత ప్రమాణాలను పాటించాలని తయారీదారులను మంత్రి కోరారు, నాసిరకం పదార్థాలను సరఫరా చేసేవారు బ్లాక్‌లిస్టింగ్‌తో సహా కఠినమైన చర్యలను ఎదుర్కొంటారని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+