విరిగిన పట్టా: వందల మంది ప్రాణాలు కాపాడాడిలా..
కోల్కతా: ఢిల్లీ-హౌరా రైలుకు తృటిలో ప్రమాదం తప్పిపోయింది. ఎరుపురంగు వస్త్రాన్ని చూపి రైలును ఆపడంతో రైలులో ప్రయాణీస్తున్న ప్రయాణీకులు ప్రాణాలతో బతికి బయటపడ్డారు.
కోల్కతా: ఢిల్లీ-హౌరా రైలుకు తృటిలో ప్రమాదం తప్పిపోయింది. ఎరుపురంగు వస్త్రాన్ని చూపి రైలును ఆపడంతో రైలులో ప్రయాణీస్తున్న ప్రయాణీకులు ప్రాణాలతో బతికి బయటపడ్డారు.
ఓ వ్యక్తి అప్రమత్తత కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడింది. సమయానికి ఎరుపు రంగు వస్త్రం చూపించి రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. హౌరా-దిల్లీ మార్గంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.

బెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్ ప్రాంతంలో రైలు పట్టా విరిగి పోయి ఉండటాన్ని అటువైపుగా వెళ్తున్న స్థానికుడు గమనించాడు. అదే సమయంలో హౌరా-దిల్లీ రైలు అటువైపుగా వస్తోంది. ప్రమాదాన్ని గమనించిన అతడు వెంటనే ఎరుపు రంగు వస్త్రాన్ని ఊపారు. ఈ ఎరుపు రంగు వస్త్రాన్ని చూసిన డ్రైవరు ప్రమాదాన్ని గ్రహించి రైలును ఆపేశాడు.
స్థానికుడు చూపిన సమయస్పూర్తితో వందలాది ప్రాణాలు కాపాడినట్టైంది. పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు వూపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది పట్టాను సరిచేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాదం నుంచి కాపాడినందుకుగాను రైల్వే అధికారులు అతడిని అభినందించారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications