హర్యానాలో బీజేపీని ముంచింది వారే ! ఎగ్జిట్ పోల్స్ చెప్తోంది ఇదేనా..?
హర్యానాలో ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికల సరళిపై పలు సర్వే సంస్థలు, జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. అయితే ఇవన్నీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని తేల్చిచెప్పేశాయి. 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో మ్యాజిక్ మార్కు అయిన 46 సీట్ల కంటే ఎక్కువగానే కాంగ్రెస్ సాధించబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. దీంతో అంకెల్లో కాస్త తేడా ఉన్నా హర్యానా మాత్రం కాంగ్రెస్ దేనని తేలిపోయింది.
హర్యానాలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని ఓటర్లు ఈసారి తిరస్కరించినట్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా కీలకమైన మూడు వర్గాల విషయంలో కేంద్రంలోని ఆ పార్టీ వ్యవహరించిన తీరు, రాష్ట్రంలో ప్రభుత్వం దానికి మద్దతునిచ్చిన తీరు ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపబోతున్నట్లు అర్థమవుతోంది. ఇందులో రైతులు, సైనికులు, రెజ్లర్లు ఉన్నారు. వీరిలో ప్రతీ వర్గం బీజేపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంది.

కేంద్రం తెచ్చిన వ్యవసాయచట్టాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొని ఢిల్లీ వరకూ వెళ్లి నిరసనలు చేశారు. వాటిని అడ్డుకునేందుకు పోలీసుల సాయంతో కేంద్రం వ్యవహరించిన తీరు రైతుల్లో ఆగ్రహం నింపింది. వ్యవసాయ చట్టాల్ని కేంద్రం వెనక్కి తీసుకున్నా రైతుల్లో ఆక్రోశం మాత్రం చల్లారలేదు. అలాగే సైనికుల కోసం కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకం కూడా ఇలాంటిదే. దీనికి వ్యతిరేకంగా హర్యానాలో ఆందోళనలు జరిగాయి. సైన్యంలో ఎక్కువ మంది ఎంపికయ్యే రాష్ట్రమైన హర్యానాలో
ఇది ఆక్రోశం నింపింది. దాని ప్రభావం ఎన్నికలపై పడింది.
మరోవైపు మహిళా రెజ్లర్ల విషయంలో కేంద్రంలో బీజేపీ సర్కార్ వ్యవహరించిన తీరు కూడా ఆ పార్టీపై ఆగ్రహానికి కారణమైంది. ముఖ్యంగా మహిళా రెజ్లర్లు తమపై లైంగిక వేధింపుల్ని నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు చేయడం, వారిని చులకన చేస్తూ బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు, బ్రిజ్ భూషణ్ కు మద్దతుగా నిలవడం వంటి కారణాలు రెజ్లర్లలో ఆగ్రహం నింపాయి. అప్పటికే బీజేపీపై ఆగ్రహంగా ఉన్న రైతులు, సైనికులు కూడా రెజ్లర్లకు అండగా నిలవడంతో ఆ పార్టీకి చుక్కలు కనిపించాయి.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications