రాహుల్ కాదు: కాంగ్రెస్ లోకసభ పక్ష నేతగా ఖర్గే
న్యూఢిల్లీ: లోకసభలో కాంగ్రెస్ పక్షనేతగా మాజీ రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే(70) వ్యవహరిస్తారని కాంగ్రెస్ సోమవారం ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జనార్ధన్ ద్వివేది ఈ విషయాన్ని ధృవీకరించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోకసభ పక్షనేతగా వ్యవహరిస్తారని వార్తలు వస్తుండగా కాంగ్రెస్ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది.
మరో మాజీ కేంద్రమంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్.. లోకసభ పక్షనేతగా ప్రకటిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మల్లిఖార్జున ఖర్గేను ప్రకటించి ఊహాగానాలకు తెరదించింది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 పార్లమెంటు స్థానాల్లో మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ 44 పార్లమెంటు సభ్యుల్లో మల్లిఖార్జున ఖర్గే సీనియర్ కావడంతో ఆయననే కాంగ్రెస్ పక్ష నేతగా ప్రకటించినట్లు తెలుస్తోంది. యూపిఏ-2 ప్రభుత్వంలో ఖర్గే రైల్వే మంత్రిగా పని చేశారు.
మల్లిఖార్జున ఖర్గే కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్లో కొనసాగుతున్న సీనియర్లలో ఈయనొక ప్రముఖ దళిత నేత. అంతేగాక కర్ణాటక అసెంబ్లీకి 9సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 2009లో లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కూడా గుల్బర్గా నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
-
Lok Sabha: 816కు లోక్ సభ సీట్లు..! ఉత్తరాదిలో గెలిస్తే అధికారమేనా ? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications