మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి: కలకత్తా హైకోర్టులో నందిగ్రామ్ ఎన్నిక విచారణ జూన్ 24కు వాయిదా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నందిగ్రామ్ నుండి తనపై పోటీ చేసిన సువేందు అధికారిని వదిలి పెట్టడం లేదు. పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత బీజేపీ చీఫ్ సువేందు అధికారి ఎన్నికపై అనుమానాలు ఉన్నాయంటూ మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో సవాల్ చేశారు. ఇక మమతా బెనర్జీ పిటిషన్ ను పరిశీలించిన కలకత్తా హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. అయితే జస్టిస్ చందా ముందు ఈ కేసు విచారణకు వెళ్లిన సమయంలో ఈ కేసును వచ్చే వారానికి వాయిదా వేయాలని ముఖ్యమంత్రి తరపు న్యాయవాది సౌమేంద్ర నాథ్ ముఖర్జీ అభ్యర్ధించారు. కోర్టు అభ్యర్థనను అంగీకరించి ఈ కేసును వచ్చే గురువారం అంటే జూన్ 24వ తేదీకి వాయిదా వేసింది.
twitter ను తుడిచిపెట్టేందుకు కేంద్రం యత్నం .. ఫైర్ అయిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై గత పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో సువేందు అధికారి రెండు వేల ఓట్ల కంటే తక్కువ తేడాతో నందిగ్రామ్ నుండి గెలుపొందారు. మొదట మమతా బెనర్జీ గెలిచినట్లు ప్రకటించిన, తరువాత మళ్లీ పలు నాటకీయ పరిణామాల మధ్య సువేందు అధికారి గెలిచినట్లుగా వెల్లడించారు. మమతా బెనర్జీ రీకౌంటింగ్ కోసం ఎన్నికల కమిషన్ ను విజ్ఞప్తి చేసినా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది.
ఈనేపథ్యంలో కోర్టును ఆశ్రయిస్తా అని చెప్పిన మమత అదేవిధంగా కోర్టు మెట్లు ఎక్కారు. ఆ సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పని చేస్తున్న కిశోర్ బిశ్వాస్ కు సైతం రక్షణ కల్పించిన మమతాబెనర్జీ ఈ రోజు కోర్టులో కేసు విచారణకు రాగా, కోర్టు ముఖ్యమంత్రి తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు ఈ కేసును జూన్ 24వ తేదీన కేసును పరిశీలించనుంది.