అందరికీ మమత బెనర్జీ షాక్: కోల్కతాలో దుమ్మురేపిన టీఎంసీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతా మున్సిపల్ కార్పోరేషన్ (కేఎంసీ) ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ దుమ్మురేపింది. ఇటీవల కేఎంసీ, సివిక్ పోల్స్ జరిగాయి. వీటి ఓట్ల లెక్కింపు మంగళవారం జరిగింది. ఇందులో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది.
కోల్కతా మున్సిపల్ కార్పోరేషన్లో 144 వార్డులు ఉన్నాయి. ఇందులో టీఎంసీ 110 వార్డుల్లో ముందంజలో ఉండటం లేదా గెలుపొందడం జరిగింది. వామపక్షాలు కేవలం 16 వార్డుల్లో ముందంజలో ఉండటం లేదా గెలుపొందడం జరిగింది.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారిన భారతీయ జనతా పార్టీ తొమ్మిది, కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఇక, రాష్ట్రంలో 51 సివిక్ బాడీల్లో టీఎంసీ గెలుపొందుతోంది. కాంగ్రెస్ ఆరు, లెఫ్ట్ ఫ్రెంట్ ఐదు స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 92 పురపాలక సంస్థల ఫలితాల్లో అరవై శాతానికి పైగా తృణమూల్ ఆధిక్యంలో ఉంది.
కాగా, గెలుపు పైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ గెలుపును రవీంద్ర నాథ్ ఠాగూర్కు అంకితం ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు.
We
will
dedicate
our
victory
to
Rabindranath
Tagore
on
9
May
through
Rabi
Pronaam
across
Bengal
—
Mamata
Banerjee
(@MamataOfficial)
April
28,
2015
అలాగే, ఈ గెలుపును బెంగాల్ ప్రజలకు అంకితమిస్తున్నట్లు మరో ట్వీట్ చేశారు. అయితే, భూకంపం విషాదం నేపథ్యంలో కార్యకర్తలు, స్థానిక పార్టీ నాయకులు ర్యాలీలకు దూరంగా ఉండాలని ఆమె కోరారు.
We
dedicate
our
victory
to
people
of
Bengal.
I
request
party
workers
to
stay
away
from
victory
rallies
today
in
light
of
#earthquake
tragedy
—
Mamata
Banerjee
(@MamataOfficial)
April
28,
2015