వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐసిస్ చేతిలో 39 మంది ఇండియన్స్ మృతి: మమతా బెనర్జీ దిగ్భ్రాంతి
కోల్కతా: ఐసిస్ ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన 39 మంది భారతీయులు చంపబడ్డారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మోసుల్ నుంచి ఈ వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని, ఇది చాలా విచారకరమని, ఆ 39 మంది కుటుంబాలను ఓదార్చేందుకు మాటలు రావడం లేదన్నారు. వారికి ఆ దేవుడు అండగా ఉండాలన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ కూడా సంతాపం తెలియజేసింది. ఇది చాలా బాధాకరమైన సమయమని, ఇలాంటి సమయంలో మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయాలని, ఉద్యోగం కల్పించాలని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు.
English summary
West Bengal Chief Minister Mamata Banerjee on Tuesday expressed grief over the death of 39 Indians kidnapped by the Islamic State terror group in Iraq's Mosul in 2014.
Story first published: Tuesday, March 20, 2018, 17:55 [IST]