కూతురిపై రేప్, అసహజ లైంగిక క్రీడ:14 ఏళ్ల జైలు
న్యూఢిల్లీ: తన కూతురిపై అత్యాచారం చేయడమే కాకుండా లైంగిక కిరాతకంగా వ్యవహరించిన వ్యక్తికి ఢిల్లీ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కూతురి పట్ల ప్రవర్తన విషయంలో ఆ వ్యక్తి మానవత్వాన్ని కూడా మరిచిపోయాడని, ఏ విధమైన పశ్చాత్తాపం కూడా ప్రదర్సించలేదని కోర్టు అభిప్రాయపడ్డారు
కూతురిపై అత్యంత కిరాతకంగా వ్యవహరించిన వ్యక్తికి అదనపు సెషన్స్ జడ్జి పవన్ కుమార్ జైన్ 14 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు 50 వేల రూపాయల జరిమానా విధించారు. కూతురిపై అత్యాచారానికి పాల్పడడంతో పాటు అసహమైన లైంగిక క్రిడకు, నేర ప్రేరేపణకు, దాడికి పాల్పడ్డాడని, బాధితురాలని కావాలని బాధపెట్టాడని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

దోషికి గతంలో కూడా నేరచరిత్ర ఉందని, పలుమార్లు జైలుకు కూడా వెళ్లాడని కోర్టు తెలియజేసింది. దోషికి కనిష్ట శిక్ష సరిపోదని, తన కూతురినే తన కామాన్ని తీర్చుకోవడానికి వాడుకున్నాడని కోర్టు అభిప్రాయపడింది. తండ్రిగా ఏ విధమైన దాడి నుంచైనా కాపాడాల్సిన తండ్రే మానవత్వ పరిధులు దాటి అత్యాచారం చేశాడని కోర్టు చెప్పింది.
తన భార్య, కూతురు వ్యభిచారానికి పాల్పడుతున్నారని ఆ వ్యక్తి ఆరోపించాడని, దీన్ని బట్టి అతనికి ఏ మాత్రం పశ్చాత్తారం లేదని అర్థమవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం - అతన ుతన కూతురిపై 2012 జులై 6వ తేదీ రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతకు ముందు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది.












Click it and Unblock the Notifications