పశువులను దొంగిలించే యత్నం: గంటలపాటు కొట్టడంతో వ్యక్తి మృతి
పాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ పశువులను దొంగతనం చేస్తున్నాడంటూ 32 ఏళ్ల ఓ వ్యక్తిని గ్రామస్తులు కొట్టి చంపారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడిన నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పాట్నా సమీపంలోని పుల్వారిషరీఫ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ గేదెను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ముహమ్మద్ అలీంగిర్ను పట్టుకుని చితకబాదారు. అతని వెంట వచ్చిన మరో వ్యక్తి పారిపోయాడు.

స్థానికులు విచక్షణారహితంగా కొన్ని గంటలపాటు కొట్టడంతో ముహమ్మద అలీంగిర్ తీవ్రగాయాలపాలయ్యారు. బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
2017లో వరుస ఘటనలు జరిగిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. మనుషులను చంపడం అనేది ఆమోద యోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే, పలు చోట్ల తమ పశువులను దొంగిలించే ప్రయత్నం చేస్తుండటం స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనైవారిపై దాడులు చేస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications