భరణం: మాజీ భార్యకు నాణేలు మూట ఇచ్చిన వ్యక్తి
అహ్మదాబాద్: మాజీ భార్య భరణం అడిగినందుకు.. దానిని నిరసిస్తూ ఓ వ్యక్తి ఏకంగా రూ.10,000 నాణేలు తీసుకు వచ్చాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. భార్యకు విడాకులు ఇవ్వడంతో... నెలకు కొంత చొప్పున భరణం ఇవ్వాలని ఓ భర్తను కోర్టు ఆదేశించింది.
అయితే ఆ తీర్పును నిరసిస్తూ... అతను పదివేల రూపాయల విలువ చేసే నాణేల మూటను తెచ్చిలెక్కించుకోమని చెప్పాడు. అహ్మదాబాద్కు చెందిన పృథ్వి ప్రజాపతి స్థానికంగా చిన్న వ్యాపారం చేస్తుంటాడు. మనస్పర్థల కారణంగా పృథ్వి 2011లో తన భార్య రమీలా బెన్తో విడిపోయాడు.

అయితే ఈ విషయమై రమీలా కోర్టును ఆశ్రయించింది. దీంతో రమీలా అవసరాల నిమిత్తం పృథ్వి ప్రతి నెలా ఆమెకు రూ.1500 చొప్పున భరణం ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే గత ఏడాది కాలంగా పృథ్వి అతని మాజీ భార్యకు నెలనెలా డబ్బులు ఇవ్వలేదు.
దీంతో మాజీ భార్య రమీలా కుటుంబ న్యాయస్థానంలో కేసు పెట్టింది. విచారించిన కోర్టు.. పృథ్వి రూ.10వేలను కోర్టు ప్రాంగణంలో ఇవ్వాలని చెప్పింది. దీంతో అతను నగదును నాణేల రూపంలో తీసుకొచ్చాడు. రూ.10వేలు విలువ చేసే నాణేల మూటను తీసుకొచ్చి.. మాజీ భార్యకు అందించి లెక్కపెట్టుకోమన్నాడు. మనస్తాపం చెందిన రమీలా డబ్బు మూటను తీసుకోకుండానే కోర్టు నుంచి వెళ్లిపోయింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications