భర్త బంధువే.. ఒంటరిగా ఉన్నప్పుడు బలవంతం.. ఆపై హత్య
గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె భర్త బంధువైన రమేష్ పటేల్ ఇంట్లోకి వచ్చాడు. ఆపై ఆమెపై అత్యాచారం చేయబోగా వివాహిత ప్రతిఘటించింది.
కోర్బా: భర్త బంధువే ఓ ఇల్లాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టబోయాడు. ఆ కీచకుడి చెర నుంచి తప్పించుకునేందుకు ఆ ఇల్లాలు గట్టిగా ప్రతిఘటించింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన ఆ కీచకుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటిచేశాడు.
ఛత్తీస్ ఘడ్ లోని కోర్బా జిల్లాలో ఉర్గా పోలీస్ స్టేషన్ పరిధిలోని మడ్వారనీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె భర్త బంధువైన రమేష్ పటేల్ ఇంట్లోకి వచ్చాడు. ఆపై ఆమెపై అత్యాచారం చేయబోగా వివాహిత ప్రతిఘటించింది.

దీంతో తీవ్ర ఆగ్రహంతో రమేష్ పటేల్ ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించేశాడు. కాలుతున్న గాయాలతో కేకలు వేస్తున్న వివాహితను పొరిగింటివారు ఆసుపత్రికి తరలించారు. 70శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో వివాహిత మృతి చెందింది. మరణవాంగ్మూలం తీసుకున్న పోలీసులు నిందితుడు రమేష్ కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications