Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సైలెంట్ గా స్కెచ్ వేసిన సీఎం, మోదీ, మాజీ సీఎం టార్గెట్, ఆయన ఎంట్రీతో సీన్ మారుతుందా !

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఫిరాయింపుల జోరు మరింత ఎక్కువైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీజేపీ, జేడీఎస్ లు ఇప్పుడు లోక్ సమరానికి ఏకం అయ్యి విజయం మాదే అనే మంత్రాన్ని జపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెక్ పెట్టడానికి బీజేపీ, జేడీఎస్ నాయకులు ఒక్కటవుతుండగా వారిని కట్టడి చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సైలెంట్‌గా ఆపరేషన్‌ హస్తం ప్రారంభించింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో చాలా సందడి చేసిన నియోజకవర్గం మండ్య అని కొత్తగా చెప్పనవసరం లేదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా మండ్య నియోజక వర్గం హాట్ టాపిక్ గా నిలిచింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నియోజకవర్గంపై పట్టు సాధించాలని బీజేపీ-జేడీఎస్ పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగడంతో మండ్య లోక్ సభ నియోజక వర్గంమీద తీవ్ర ఆసక్తి నెలకొంది.

Mandya BJP leader and former minister KC Narayana Gowda is joining the Congress party ?
జేడీఎస్, బీజేపీ పొత్తు కారణంగా మండ్య లోక్‌సభ నియోజకవర్గం జేడీఎస్ పార్టీకి ఇవ్వడంతో ఆ పార్టీ నేతల మద్దతు లభించింది. అయితే మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్‌కు ఈసారి బీజేపీ టికెట్ దక్కడం అనుమానమే. మండ్యలో తమ ఉనికిని మరింతగా కాపాడుకోవడానికి, మండ్య నియోజకవర్గాన్ని వదులుకోవాలని దళపతులు బీజేపీ హైకమాండ్ నేతలను కోరారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మండ్య లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

బీజేపీ, జేడీఎస్ కూటమి మాజీ మంత్రి కె.సీ. నారాయణ గౌడ్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఈ వ్యతిరేకత వెనుక హస్తం వ్యూహం దాగి ఉందని కర్ణాటక రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో బీజేపీ నేత, మాజీ మంత్రి నారాయణ గౌడ్ బీజేపీని వీడాలని భావిస్తున్నారు. మండ్య జిల్లాలో తొలిసారిగా జేడీఎస్ కంచుకోటలో కేసీ. నారాయణ గౌడ్‌ బీజేపీ జెండా ఎగరవేశారు. అయితే ఇప్పుడు మళ్లీ అదే నారాయణ గౌడ మళ్లీ ఫిరాయింపులకు సిద్ధమైనట్లు వెలుగు చూసింది. లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ-జేడీఎస్‌ పొత్తు పెట్టుకోవడంతో మండ్య జిల్లా బీజేపీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

Mandya BJP leader and former minister KC Narayana Gowda is joining the Congress party ?

జేడీఎస్ తో పొత్తును వ్యతిరేకించిన బీజేపీ మాజీ మంత్రి కేసీ నారాయణగౌడ్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని అంటున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మాజీ మంత్రి కేసీ నారాయణగౌడ్ రహస్యంగా సమావేశమై చర్చలు జరపడమే ఇందుకుకారణం అయ్యిందని వెలుగు చూసింది. అమావాస్య దాటిన తరువాత మంచి రోజు చూసి బీజేపీ మాజీ మంత్రి కేసీ నారాయణ గౌడ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వెలుగు చూసింది. అయితే మాజీ మంత్రి కేసీ నారాయణ గౌడ కాంగ్రెస్ వెళ్లకుండా చూడాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+