పట్టాలు తప్పిన మంగళ రైలు: నలుగురు మృతి?

శిథిలాల కింద 25 మంది చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. రైలు ప్రమాదం శుక్రవారం ఆరున్నర గంటల ప్రాంతంలో జరిగింది. మధ్య రైల్వేలోని నాసిక్ సమీపంలో ఘోటీ - ఇగ్తాత్పూర్ సెక్షన్ మీదుగా వెళ్తుండగా నిజాముద్దీన్ - ఎర్నాకులం మంగళ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది.
ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. గాయపడినవారిని ఘోటీ,త కాసర, నాసిక్ సివిల్ ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తమ బంధువుల ఆచూకీ తెలుసుకోవడానికి మధ్య రైల్వే హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది.
ఈ ప్రమాదంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మన్మాడ్ - కుర్లా - గోదావరి ఎక్స్ప్రెస్, మన్మాడ్ - ముంబై పంచవటి ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు పలు రైళ్లు రద్దయ్యాయి. సేవాగ్రామ్ ఎక్స్ప్రెస్, రాజ్య రాణి ఎక్స్ప్రెస్ రైళ్లను లాసాల్గావ్ వద్ద నిలిపేశారు.












Click it and Unblock the Notifications