కేజ్రీ పార్టీ కంటే బెట్టర్గా: మాంఝీ కొత్త పార్టీ! నితీష్పై సంచలనం
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జేడీయు నుండి సస్పెండైన నేత జీతన్ రామ్ మాంఝీ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. మాంఝీ ఏఏపీ సమన్వయకర్త, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అనుసరించేలా కనిపిస్తున్నారు. మాంఝీ మద్దతుదారులు హిందూస్తాన్ అవామీ మోర్చా పేరుతో ఓ ఫ్రంట్ను స్థాపించారు.
ఈ సందర్భంగా మాంఝీ మాట్లాడారు. తాము ప్రస్తుతం హిందూస్తాన్ అవామీ మోర్చాను ప్రారంభించామని, ఇది అందరినీ కలుపుకొని వెళ్తుందని చెప్పారు. ఇది ఏఏపీ కంటే ఉన్నతంగా ఉంటుందని చెప్పారు. బీహార్లో ప్రజా ఉద్యమం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే హిందుస్తాన్ అవామీ మోర్చా అనే ఫ్రంట్ తీసుకు వచ్చినట్లు చెప్పారు.

మరోవైపు, జీతన్ రామ్ మాంఝీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల వివక్ష చూపించి తనను నితీష్ అవమానించారన్నారు.
తాను రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి నివాసాన్ని పవిత్ర గంగాజలంతో కడిగించారని ధ్వజమెత్తారు. బీహార్లో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ప్రస్తుతం తన పరిస్థితికి జేడీయులోని అగ్రకుల నాయకులే కారణమన్నారు. తాను దళితుడిని కాబట్టి అన్యాయం జరిగిందన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications