Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు ప్లేస్, టైమ్ ఫిక్స్-కేంద్ర హోంశాఖ ప్రకటన..!

డిసెంబర్ 26వ తేదీ అనారోగ్యంతో కన్నుమూసిన భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన భౌతిక కాయాన్ని అభిమానులు, నాయకులు, ప్రముఖుల సందర్శన కోసం ఆయన నివాసంలోనే ఉంచారు. డిసెంబర్ 28 శనివారం మన్మోహన్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో యమునా నదీ తీరంలో మన్మోహన్ అంత్యక్రియలు, స్మారకం ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. అయితే కేంద్రం మరో చోటు కేటాయించింది.

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు యమునా నది తీరంలోని రాజ్ ఘాట్ వద్ద స్థలం కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. అలాగే ఫోన్ కూడా చేసినట్లు ఆయన వెల్లడించారు. నిన్న ఉదయం తాను ప్రధాని మోడీకి ఫోన్ చేసి డిసెంబర్ 28న జరిగే డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు చోటు కేటాయించాలని కోరినట్లు ఖర్గే తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు.

manmohan singh s funeral tomorrow congress ask place at raj ghat for memorial

భారతదేశపు గొప్ప కుమారుడి స్మారకానికి ఇది పవిత్ర వేదికగా ఉంటుందని ఖర్గే ఎక్స్ లో తెలిపారు. గతంలో పలువురు మాజీ ప్రధానులు, రాజనీతిజ్ఞుల అంత్యక్రియలు రాజ్ ఘాట్ లోనే జరిగాయని, అక్కడే సంప్రదాయం ప్రకారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారకం ఏర్పాటు కోసం స్థలం ఇవ్వాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు కోరారు. అయితే కేంద్రం మాత్రం నిగమ్ బోధ్ ఘాట్ ను మన్మోహన్ అంత్యక్రియలకు కేటాయించింది. డిసెంబర్ 28వతేదీ ఉదయం 11.45కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+