మెరుగైన చికిత్స కోసం అమెరికాకు గోవా సీఎం పారికర్
ముంబై: గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ అత్యవసర చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్నారు. ఈ మేరకు గోవా గవర్నర్ మృదుల సిన్హా ఆఫీస్ నుంచి ప్రకటన విడుదలైంది. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం తాను అమెరికా వెళుతున్నట్టు తెలుపుతూ గవర్నర్కు పారికర్ లేఖ రాశారు.
ఆ విషయాన్నే తెలుపుతూ గవర్నర్ ఆఫీసు నుంచి ప్రకటన విడుదలైంది. అంతేగాక గోవా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పారికర్ వీడియో విడుదల చేశారు. తనకు మెడికల్ లీవ్ కోరారు. తన కోసం ప్రార్థనలు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉంటే ఇటీవలే ముంబైలో ఆయన రెండు సార్లు మెడికల్ చెకప్ చేయించుకున్నారు. స్వల్ప కాలేయ వ్యాధితో పారికర్ బాధపడుతున్నట్లు తెలిసింది. గత ఫిబ్రవరి 15న ఆయన లీలావతి హాస్పిటల్లో అకస్మాత్తుగా చేరారు.ఇవాళ అమెరికాకు పారికర్ బయలుదేరి వెళ్ళనున్నారు.
More From
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications