ఎన్ఎండీసీ గనులపై మావోల దాడి: 50 కోట్ల ఆస్తి నష్టం
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బచేలి వద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ ఆధ్వర్యంలోని గనులపై ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. సుమారు 40 మంది మావోయిస్టులు రాత్రి 11 గంటల సమయంలో ఎన్ఎండీసీ గనులపై దాడి చేశారు.
ఈ క్రమంలో అక్కడ భద్రతా విధులను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్ బలగాలు మావోయిస్టులను సమర్థవంతంగానే ఎదుర్కొన్నాయి. రాత్రి 11 గంటల నుంచి 2 గంటల దాకా ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. అర్థరాత్రి 2 గంటల వరకు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.

ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. సీఐఎస్ఎఫ్ బలగాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన నేపథ్యంలో మావోయిస్టులు ఎన్ఎండీసీకి చెందిన పలు వాహనాలు, షావెల్ మెషిన్లు, డ్రిల్ మెషిన్, పంపు మోటార్లకు నిప్పుపెట్టారు.
ఈ దాడిలో రూ. 50 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భద్రత పెంచినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications