నాథులా లోయలో భారీ హిమపాతం: ఆరుగురు మృతి, మంచుకిందే పలువురు పర్యాటకులు
న్యూఢిల్లీ: సిక్కింలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాథూలా పర్వత లోయ ప్రాంతంలో మంగళవారం భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు పర్యాటకులు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో పర్యాటకులు మంచు కింద చిక్కుకుపోయినట్లు సమాచారం.
సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ను .. చైనా సరిహద్దు సమీపంలోని నాథులా పాస్ను కలిపే జవహర్ లాల్ నెహ్రూ మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సరిహద్దు రహదారుల సంస్థ, సిక్కిం పోలీసులు, స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 22 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గ్యాంగ్టక్కు తరలించినట్లు వెల్లడించారు. మంచు కారణంగా రోడ్డుపై వాహనాల్లో చిక్కుకుపోయిన 350 మందిని కాపాడినట్లు తెలిపారు. కాగా, హిమపాతం సంభవించినప్పుడు 150 మందికి పైగా విహారయాత్రలు ఆ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం.

మార్చి నుంచి సిక్కిం సాధారణ హిమపాతాన్ని ఎదుర్కొంటోంది. నాథులా పాస్కు దారితీసే జేఎన్ రోడ్లోని 13వ మైలుకు పర్యాటకుల ప్రవేశాన్ని పరిమితం చేసింది.
Another video Many people trapped in #Avalanche , some tourists rolled down into the gorge from road
— Siraj Noorani (@sirajnoorani) April 4, 2023
Casualties feared🙏🏻
Waiting for more info#Sikkim #Changu #Tsomgo @shubhamtorres09 video@shubhamtorres09 video pic.twitter.com/cy9wxewJ3k
పర్యాటకులు 13వ మైలు వరకు వెళ్లేందుకు అనుమతించినప్పటికీ.. హిమపాతం కారణంగా వారిలో చాలా మంది 15వ మైలు వరకు ఎక్కారని సిక్కిం ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. దాని సుందరమైన అందం కారణంగా, చైనా సరిహద్దులో ఉన్న నాథులా పాస్ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications