పూజల తర్వాతే రాష్ట్ర అభివృద్ధి: యోగి ఆదిత్యనాథ్పై మాయావతి
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం పాలన సమాజ్వాది పార్టీ పాలన కంటే దారుణంగా ఉందని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి మంగళవారం అన్నారు.
లక్నో: యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం పాలన సమాజ్వాది పార్టీ పాలన కంటే దారుణంగా ఉందని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి మంగళవారం అన్నారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఆలయాల్లో పూజల తర్వాతనే అభివృద్ధి పడుతోందన్నారు. యోగి దేవాలయాల్లో పూజలు చేసుకున్న తర్వాత సమయం ఉంటే రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచిస్తారని సెటైర్లు వేశారు.

ఆదిత్యనాథ్ వెనుకబడిన పూర్వాంచల్ నుంచి వచ్చిన నేత అని, అయినప్పటికీ ఆయన ఆ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదన్నారు. యోగి ఎల్లప్పుడూ ఆలయాల్లోనే కనిపిస్తున్నారన్నారు. బిజెపి పాలనలో నవ భారతం సాధ్యం కాదన్నారు.












Click it and Unblock the Notifications