100మీటర్ల లోయలో పడిన బస్సు: 10 మంది మృతి
షిల్లాంగ్: మేఘాలయలోని తూర్పు జైనిటా హిల్స్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అస్సా రాజధాని గౌహతి నుంచి మేఘాలయ మీదుగా హైలకండి వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు టాంగ్సెంగ్ వద్ద 100 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది.
ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆ వస్తువు యుద్ధ విమానం నుంచి పడిందా?
రాజస్థాన్ లోని బార్మర్ ప్రాంతంలో యుద్ధ విమానాల నుంచి కొన్ని వస్తువులు జారిపడ్డట్లు తెలుస్తోంది. గ్రామస్తుల సమాచారం మేరకు విచారణ నిమిత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల బృందం ఆ ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. గుగ్డి గ్రామంపై నుంచి అతి తక్కువ ఎత్తులో ఈ యుద్ధ విమానాలు ప్రయాణించాయని, వాటి నుంచి జారి పడ్డ వస్తువుల తాకిడికి కొన్ని గృహాలు కూడా దెబ్బతిన్నాయని గ్రామస్తులు చెప్పినట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. యుద్ధవిమానాలు వెళ్లడంతో విపరీతంగా దుమ్ము లేచి, పెద్ద శబ్దం వచ్చిందని గుగ్డి గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.