స్కూల్లో గ్యాంగ్ రేప్తో గర్భం దాల్చిన మతిస్థిమితం లేని బాలిక
నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్లో ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న పాఠశాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుండగులు ఓ మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం చేశారు. దాంతో ఆమె గర్భం దాల్చింది. మానసిక వికలాంగుల ప్రభుత్వ వసతి గృహంలో భద్రతా విధులు నిర్వహిస్తన్న కిసాన్ బౌనే, వంటమని,ి కాంబ్లీ ఐదు నెలల కింద ఓ బాలికపై వసతి గృహంలో అత్యాచారం చేశారు.
అభ్యంతరకరమైన రీతిలో ఆ బాలిక చిత్రాలను కూడా వారు తీశారు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. నిందితులపై కేసు నమోదు చేశామని, వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. అభ్యంతరకరమైన చిత్రాలను చూపించి, బయటకు చెప్తే వాటిని బయటపెడుతామని నిందితులు బాలికను బెదిరించారు.
బాధితురాలి తండ్రి నాగపూర్లోని రాణా ప్రతాప్ నగర్ పోలీసు స్టేషన్లో బుధవారంనాడు ఫిర్యాద చేశాడు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి బిఎ వాణి గురువారం ఉదయం వసతిగృహాన్ని సందర్సించారు. వసతిగృహంలో బాలికలతో పాటు 47 మంది ఉన్నారు.
బాధితురాలికి 17 ఏళ్లుంటాయి. ఆ ఆశ్రమ పాఠశాలను వికలాంగులైన పిల్లల కోసం నిర్దేశించారు. ఆ హాస్టల్లో ఆ దారుణం చోటు చేసుకుంది.