Metro Under Water Journey: నీటిలో నడిచే మెట్రో రైలు.. దేశంలోనే మొదటిసారిగా.. ఎక్కడంటే..!
దేశంలో మొట్టమొదటిసారిగా నీటిలో మెట్రో రైలు నడిచి చరిత్ర సృష్టించింది. బుధవారం కోల్కతాలో హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగం గుండా మెట్రో రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. కోల్ కతాలోని మహాకరణ్ స్టేషన్ నుంచి హావ్డా మైదాన్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలు ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రైన్లో కోల్కతా మెట్రో జనరల్ మేనేజర్ P ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు..కొందరు ఇంజినీర్లు, అధికారులు ప్రయాణించారు.
"ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు కోల్కతా మెట్రో రైల్వే జనరల్ మేనేజర్ పి ఉదయ్ కుమార్ రెడ్డి రేక్ నంబర్ MR-612లోని మహాకరన్ నుంచి హౌరా మైదాన్ స్టేషన్కు ప్రయాణించారు. ఈ రేక్ 11:55 గంటలకు హుగ్లీ నదిని దాటింది. శ్రీ హెచ్.ఎన్. జైస్వాల్, మెట్రో రైల్వే అదనపు జనరల్ మేనేజర్, MD, KMRCL అలాగే మెట్రో రైల్వే, KMRCL యొక్క ఇతర సీనియర్ అధికారులు ఈ ప్రయాణంలో ఆయనతో పాటు ఉన్నారు" అని KMRCL ఒక ప్రకటనలో తెలిపింది.

తర్వాత, రేక్ నెం MR- 613ని కూడా హౌరా మైదాన్ స్టేషన్కు తీసుకెళ్లారు. దీనిని చారిత్రాత్మక సంఘటనగా పేర్కొంటూ, తదుపరి 7 నెలల పాటు హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ వరకు ట్రయల్ రన్ నిర్వహించబడుతుంది.ఆ తర్వాత ఈ స్ట్రెచ్లో సాధారణ సేవలు ప్రారంభమవుతాయని జనరల్ మేనేజర్ తెలియజేశారు. KMRCL సిబ్బంది, ఇంజనీర్లు అందరూ ఎవరి కృషి, పర్యవేక్షణలో ఈ ఇంజనీరింగ్ అద్భుతం సాధించబడిందో వారి కలలు నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు.
హుగ్లీ నదిలో రైలు వెళ్లడం ఇదే తొలిసారి. ఇది 33 మీటర్ల లోతులో ఉన్న అత్యంత లోతైన స్టేషన్. భారత్లో నీటి లోపల మెట్రో రైలు వెళ్లడం ఇదే తొలిసారి. కోల్కతా నగరానికే కాదు..యావత్ భారతదేశానికి ఇది చారిత్రాత్మక ఘట్టం. వచ్చే 7 నెలల పాటు హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లెనేడ్ వరకు ట్రయల్ రన్ కొనసాగనుంది. ఆ తర్వాత ప్రజల కోసం రెగ్యులర్ సర్వీసులు నడుస్తాయి.
ఈ మార్గం కోల్కతాలోని ఐటీ హబ్ సాల్ట్ లేక్లోని హౌరా మైదాన్, సెక్టార్ Vని కలుపుతోంది. ఈరోజు రెండు మెట్రో రేక్లను ఎస్ప్లానేడ్ స్టేషన్ నుండి హౌరా మైదాన్ స్టేషన్కు తీసుకెళ్లినందున, త్వరలో హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ వరకు 4.8 కిలోమీటర్ల భూగర్భ విభాగంలో ట్రయల్ రన్ ప్రారంభమవుతుని అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాదిలో ఈ మార్గంలో వాణిజ్య సేవలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. హౌరా దేశంలోని లోతైన మెట్రో స్టేషన్ (ఉపరితలం క్రింద 33 మీటర్లు) అవుతుంది. హుగ్లీ నది కింద 520 మీటర్ల మేర మెట్రో 45 సెకన్లలో చేరుతుందని అంచనా. నది కింద ఉన్న ఈ సొరంగం నీటి మట్టానికి 32 మీటర్ల దిగువన ఉంది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications