విభజన సమస్యలపై కేంద్రం మరో భేటీ- ఈనెల 23న ఢిల్లీలో- ఆ డెడ్ లైనే కారణం !
ఏపీ, తెలంగాణ మధ్య విభజన జరిగి 8 ఏళ్లు దాటిపోయింది. మరో 20 నెలలైతే విభజనకు పదేళ్లు పూర్తవుతాయి. ఈ లోపు విభజన సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం మరో భేటీకి సిద్ధమైంది. ఈ నెల 23న ఢిల్లీకి రావాలని ఇరు తెలుగు రాష్ట్రాలకు సమాచారం పంపింది.
తాజాగా సెప్టెంబర్ 27న ఢిల్లీలో హోంశాఖ భేటీ నిర్వహించింది. ఇందులో విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాలతో చర్చలు జరిపింది. ఈ భేటీలో ఉమ్మడి సమస్యలతో పాటు ఏపీకి చెందిన 7 సమస్యలపై చర్చించారు. అయితే ఇందులో ఏపీ తరఫున లేవనెత్తిన అంశాల్లో ఏ ఒక్కదానికీ కేంద్రం పరిష్కారం చూపలేకపోయింది. అలాగే పాత హామీల అమలుకు కొత్తగా హామీ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో పాటు ఏపీ రాజధానికి నిధుల కేటాయింపు కూడా చర్చకు వచ్చింది. అయితే కేంద్రం మాత్రం అమరావతికి నిధులు ఇవ్వబోమని తెలిపింది.

సీఎం జగన్ గతంలో ప్రధానిని కలిసినప్పుడు అమరావతికి నిధులు ఇవ్వొద్దని కోరినట్లు కేంద్ర హోంశాఖ గత భేటీలో ఏపీ అధికారులకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అమరావతికి నిధులు నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారమేదీ లేదు. అయితే పెండింగ్ లో ఉన్న మిగతా అంశాలపై ఈసారి భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇందులో రెవెన్యూ లోటు భర్తీ, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు వంటి అంశాలున్నాయి.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications