మైనింగ్ కింగ్ శేఖర్ రెడ్డి అరెస్టు: జ్యుడిషీయల్ కస్టడీలోకి తీసుకున్న ఈడీ
శేఖర్ రెడ్డి మరియు అతని వ్యాపార భాగస్వామి శ్రీనివాసులుపై ఈడీ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది.
చెన్నై: టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, మైనింగ్ కింగ్ శేఖర్ రెడ్డిని ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్) అదుపులోకి తీసుకుంది. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి అనుమతి మేరకు మార్చి 28వరకు శేఖర్ రెడ్డిని ఈడీ జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోనుంది.
సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్దిరోజులకే ఈడీ ఆయన్ను అరెస్టు చేయడం గమనార్హం.
నోట్ల రద్దు తర్వాత రూ.34కోట్లు శేఖర్ రెడ్డి ఇంట్లో పట్టుబడిన కేసుకు సంబంధించి ఈడీ ఆయన్ను విచారించనుంది. లెక్కాపత్రం లేని పాత కరెన్సీని కొందరు అధికారుల సాయంతో వివిధ బ్యాంకుల్లో మార్చినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
పెద్దనోట్ల రద్దు ప్రకటించిన 24రోజుల్లోనే ఆయన ఈ వ్యవహారాన్ని చక్కబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.దీనికి సంబంధించి తొలుత సీబీఐ విచారణ సాగించగా.. ఇప్పుడదే కేసు ఈడీ చేతుల్లోకి వెళ్లింది.

కాగా, అంతకుముందు శేఖర్ రెడ్డి మరియు అతని వ్యాపార భాగస్వామి శ్రీనివాసులుపై ఈడీ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. నోట్ల రద్దు తర్వాత అంత భారీ మొత్తంలో కొత్త నోట్లతో కూడిన నగదు వీరి వద్దకు ఎలా చేరిందన్న విషయంపై ఈడీ దర్యాప్తు కొనసాగించనుంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications