కదులుతున్న కారులో 14ఏళ్ల బాలికపై 5 గంటల పాటు అత్యాచారం
హామీర్పూర్: ఢిల్లీలో నిర్భయ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన కేంద్ర ప్రభుత్వం నిర్భయ పేరుతో చట్టాన్ని తెచ్చినా, అదే తరహా ఘటనలు దేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర్ప్రదేశ్లోని హామిర్పూర్లో కదులుతున్న వ్యాన్లో ముగ్గురు వ్యక్తులు 14ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హామీర్పూర్ మార్కెట్ సమీపంలో ఆదివారం సాయంత్రం బాలికను ముగ్గురు దుండగులు ఎత్తుకెళ్లి కదులుతున్న వ్యాన్లో అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఐదు గంటల తర్వాత బాలికను నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసారు.
అనంతరం ఇంటికి వెళ్లిన నిందితురాలు తమ తల్లిదండ్రులతో జరిగిన విషయాన్ని తెలియజేసింది. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని దయాశంకర్, బాన్స్ గోపాల్గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.