వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమ్మాయిపై గ్యాంగ్ రేప్: ఐదు దెబ్బలతో సరి
భాగ్పట్: ఓ సామూహిక అత్యాచారం ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భాగ్పట్లోని ఓ పంచాయతీ దుర్మార్గమైన తీర్పు చెప్పింది. 15 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. వారి ముగ్గురిని ఐదు దెబ్బలు కొట్టి వదిలేయాలని పంచాయతీ తీర్పు చెప్పింది.
ఆ తర్వాత నిందితులను స్వేచ్ఛగా వదిలేసింది. పాఠశాలకు వెళ్తుండగా ఆమ్మాయిని ముగ్గురు అపహరించారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు. ఈ సంఘటనపై భాగ్పట్ పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఆ ముగ్గురిపైనే కాకుడండా పంచాయతీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురు నిందితులు కూడా పరారీలో ఉన్నారు.
హర్యానాలో కూడా నిరుడు డిసెంబర్లో ఓ పంచాయతీ ఇటువంటి తీర్పే చెప్పింది. హిసార్ జిల్లాలో అత్యాచారం చేసిన ఇద్దరు నిందితులకు ఐదు దెబ్బ కొట్టడమే శిక్షగా విధించింది. వారికి ఐదు చెప్పు దెబ్బలు శిక్షగా విధించింది.
Comments
English summary
A panchayat in Bhagpat, Uttar Pradesh, gave an extremely senseless ruling when it ordered just five slaps as punishment for three men accused of gang-raping a 15-year-old girl.
Story first published: Friday, January 22, 2016, 13:29 [IST]