వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కదులుతున్న కారులో బాలికపై నలుగురు గ్యాంగ్ రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్భయ తరహా సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు వ్యక్తులు ఓ బాలికపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చకేరీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మందులు కొనడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ సమంయలో నలుగురు కిరాతకులు ఆమెను కిడ్నాప్ చేసి కదులుతున్న కారులో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఉన్నవో జిల్లాలోని బాంత్రా టోల్ ప్లాజ్ సమీపంలోని ముళ్ల పొదల్లో ఆమెను విసిరేశారు.

 Minor girl gang-raped by four men in a moving car in Kanpur

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరో గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే మరో సామూహిక అత్యాచారం కేసు నమోదైంది. 16 ఏళ్ల అమ్మాయిపై తన మిత్రుడు సహాయంతో గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేశాడు. పొలంలో పనిచేస్తున్న తండ్రికి మధ్యాహ్నం భోజనం తీసుకుని వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమెపై దురాగతానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పతారా గ్రామంలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ నిందితులను పట్టుకోలేదు.

English summary
A class eighth girl was allegedly gang-raped by four men in a moving car. The girl was on her way to buy some medicine when four people abducted her near Chakeri Police area and raped her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X