కదులుతున్న కారులో బాలికపై నలుగురు గ్యాంగ్ రేప్
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్భయ తరహా సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు వ్యక్తులు ఓ బాలికపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చకేరీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మందులు కొనడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ సమంయలో నలుగురు కిరాతకులు ఆమెను కిడ్నాప్ చేసి కదులుతున్న కారులో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఉన్నవో జిల్లాలోని బాంత్రా టోల్ ప్లాజ్ సమీపంలోని ముళ్ల పొదల్లో ఆమెను విసిరేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మరో గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే మరో సామూహిక అత్యాచారం కేసు నమోదైంది. 16 ఏళ్ల అమ్మాయిపై తన మిత్రుడు సహాయంతో గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేశాడు. పొలంలో పనిచేస్తున్న తండ్రికి మధ్యాహ్నం భోజనం తీసుకుని వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమెపై దురాగతానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పతారా గ్రామంలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ నిందితులను పట్టుకోలేదు.