బయటకు వెళ్దామని పిలిచి బాలికపై గ్యాంగ్రేప్ చేశారు
థానే: మహారాష్ట్రలోని థానేలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బయటకు వెళ్దాం రమ్మని పిలిచిన నలుగురు యువకులు.. ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే.. కళ్యాణ్ ప్రాంతానికి చెందిన ఓ 13ఏళ్ల బాలికకు ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేసి బయటకు రమ్మన్నారు. ఇంటి బయటకు వచ్చిన ఆ బాలిక వారితో వెళ్లేందుకు నిరాకరించడంతో బలవంతంగా ఆమెను బైక్పై ఎక్కించి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.

అక్కడ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఎయిర్పోర్ట్ గస్తీ అధికారి ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications