షాకింగ్: బాలికను 2 నెలలు రేప్ చేసిన ట్యూటర్లు
పాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణం వెలుగు చూసింది. రాష్ట్రంలోని నవడ జిల్లాలో 16 ఏళ్ల మైనర్ బాలిక పైన ట్యూటర్లు అత్యాచారం చేశారు. గత రెండు నెలలుగా ప్రైవేటు మాస్టర్లు ఇద్దరూ ఈ ఘాతుక చర్యకు పాల్పడుతున్నాడని స్థానిక పోలీసులు తెలిపారు. బాలికను కోచింగ్ సెంటర్లోని ట్యూటర్లు ఇద్దరూ ఆమెను భయపెట్టి అత్యాచారం చేసేవారు.
మస్కౌర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ధోరా గ్రామానికి చెందిన బాలిక ట్యుటోరియల్ కాస్లులకు వస్తుండేది. ఆమెను బెదిరించి, మభ్యపెట్టి ట్యూటర్లు ఇద్దరూ దారుణానికి ఒడిగట్టారు. బైక్పై తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడుతుండేవారు.
శుక్రవారం ఆ కాముకుల చెర నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులను ఆశ్రయించింది. బాలికను సర్దార్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాహుల్ కుమార్, అమిత్ కుమార్ తనపై అఘాయిత్యం చేసేవారని బాలిక చెప్పింది. నిందితులపై కేసు నమోదు చేసినట్టు డిఎస్పీ వెల్లడించారు.
ఈ సంఘటన మస్కౌర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మైనర్ బాలికను నిందితులు ఇద్దరు కూడా రహస్య ప్రాంతంలో దాచి పెట్టి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. శుక్రవారం నాడు బాధిత బాలిక వారి నిర్బంధం నుండి తప్పించుకుందని వారు తెలిపారు.
అనంతరం హిసువాకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సదార్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. సదార్ ఆసుపత్రి వైద్యులు ఆమె పైన అత్యాచారం జరిగినట్లుగా తేల్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.