రూ.1000కోట్ల స్కాం: మిసా భారతికి సమన్లు, జరిమానా
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతికి ఆదాయపు పన్ను శాఖ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. బినామీ భూములు, పన్ను ఎగవేత కేసులో విచారణకు హాజరు కావాలని సూచించింది.
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతికి ఆదాయపు పన్ను శాఖ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. బినామీ భూములు, పన్ను ఎగవేత కేసులో విచారణకు హాజరు కావాలని సూచించింది.
రూ. 1000కోట్ల మనీ లాండరింగ్ కేసులో మంగళవారం విచారణ అధికారి ముందు మిసా భారతి హాజరుకావాల్సి ఉంది. అయితే మంగళవారం విచారణకు ఆమె గైర్హాజరు కావడంతో రూ. 10వేలు జరిమానా విధించింది. జూన్ 12న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

వ్యక్తిగత హాజరు నుంచి మిసా భారతికి మినహాయింపు ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోరగా, దర్యాప్తు అధికారి తిరస్కరించారు. లాలూ కుమార్తె, అల్లుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మే నెలలో ఆదాయపుపన్ను శాఖ అధికారులు వారి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు.
వీరి ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ రాజేష్ కుమార్ అగర్వాల్ను ఈడీ అధికారులు మే 22న అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మిసా భారతి, శైలేష్ లకు ఆదాయపుపన్ను శాఖ సమన్లు జారీచేసింది.












Click it and Unblock the Notifications